Thursday 22 December 2011

Happy Birthday Jo


ఒక చోట అందరూ గుమిగూడి ఉన్నారు. కిందకు నీళ్ళలోకి తొంగి చూస్తున్నారు. ఇంతలో ఒకబ్బాయి నీళ్ళలో దూకాడు. ముందు మునిగిపోయినా మెల్లిగా ఈదుకుంటూ పైకి వచ్చాడు. అందరూ అతన్ని అభినందించారు.. కాని అతను మాత్రం కోపంగా అరిచాడు.. ఎవర్రా ? నన్ను నీళ్ళలో తోసింది? నాకు అసలే ఈత రాదు. ఏదో ప్రాణభయంతో కాళ్ళు చేతులు ఆడిస్తూ పైకి వచ్చా."""




ఈ కథ ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా?? ఏం లేదండి కొద్ది రోజులుగా ఊరికే ఇదే ఆలోచన వస్తుంది. అసలు హాయిగా టీవీ సీరియళ్లు చూసుకుంటూ టైం పాస్ చేసేదాన్ని . ఊరికే టీవీ ముందు సెటిల్ అవుతున్నానని నెట్ లోకి తోసేసారు మావారు , కొడుకు. ఇక్కడ కూడా రాయమంటూ ప్రోత్సహించి ముందుకు తోసారు తోటి బ్లాగర్లు. సరే అని ఏదో తోచింది రాసుకుంటుంటే పత్రికల్లో రాయమన్నారు .. సరే అని అది ట్రై చేశా.. యిపుడు బ్లాగు రాయడం సంగతి ఏమో కాని ఇంట్లో కూడా తీరడం లేదు. ఎవరితో కలవడానికి కూడా టైం సరిపోవడం లేదు. అందరూ తిడుతున్నారు. అసలు ఉన్నావా లేదా అని. ప్చ్.. ఏం చేయను. అందుకే అప్పుడపుడు అనుకుంటాను ఎవర్రా నన్ను రాయమని తోసింది అని...



కాని .. ఈ జాలం వల్ల నాకు ఎంతో మంది వ్యక్తులు పరిచయమై ఆత్మీయ స్నేహితులుగా మారారు. ఒక్కోసారి ఆ అభిమానం, ఆప్యాయత, గౌరవం చూస్తుంటే ఆశ్చర్యంగా, విస్మయంగా ఉంటుంది. ఏమిటీ సంబంధం?, ఎందుకీ అనుబంధం?.. వారంతా సంతోషంలో, బాధలో నాకు తోడుగా ఉండి నాతో పాటు సంతోషించారు, ఓదార్చారు. తప్పులుంటే ఎత్తి చూపారు. సరిదిద్దారు. వంట, ఇల్లు, పిల్లలు , కుటుంబం తప్ప వేరే తెలీని, పెద్ద చదువులు లేని నన్నుఈ స్థాయికి చేరుకోవడానికి, నాకంటూ ఒక గుర్తింపును తెచ్చుకోవడానికి ప్రోత్సహించిన వారందరికీ నా పుట్టినరోజు సందర్భంగా హృదయ పూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇంతకంటే ఏమివ్వగలను??? సామాన్య గృహిణి నుండి ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా మారడానికి సహకరించిన పెద్దలకు నమస్సులు. అంతేకాక ఈ ఏడాది చాలా బాగా గడిచింది. అమ్మాయి పెళ్లి బాగా జరిగింది. తను సంతోషంగా ఉంది. అబ్బాయి కూడా మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. అమ్మాయి దూరంగా ఉన్నా అబ్బాయి ఇక్కడే మాతోనే ఉన్నాడు. సో హ్యాపీస్..




అసలు పుట్టినరోజు అంటే జీవితంలో ఒక ఏడాది తరిగిపోవడమే. అందులో చెప్పుకోవడానికి ఏముందని? .. పదిమందికి ఉపయోగపడితేనే ఆ పుట్టినరోజుకు ఆ జన్మకు సార్ధకత లభిస్తుంది. ఇలా అంటున్నాను కదా అని నా ప్రయాణం ఇంతటితో అయిపోయిందని అనుకోవడం లేదు. ఇంకా ముందుముందు ఏం జరుగుతుందో కూడా ఆలోచించ దలుచుకోలేదు. ఆంతా ఆ జగన్మాత దయ. ఎలా తీసికెళ్తే అలా వెళ్ళిపోవడమే..

Wednesday 21 December 2011

వెచ్చదనం పంచాలని ఉందా?




TMAD వాళ్ళు చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రమదావనం తన వంతు సాయం చేస్తుంది. మీలో ఎవరైనా సాయం చేయాలనుకుంటే ప్రశాంతికి మెయిల్ పెట్టండి . ఈ దుప్పట్ల పంపిణీలో మీరు కూడా పాల్గొనవచ్చు.
prasanthi.uppalapati@gmail.com


Greetings!!
Taken up blanket distribution project again. This time we want to give in M N J Cancer Hospital.
Now that we are going to end the year, I thought people might have some fund reserved for service activities and being winter, blanket distribution is one ideal project which people consider.
Pl. go through this URL: http://wp.me/p1Epu-30
We, TMAD, want to distribute a minimum of 100 blankets to the patients who stay in M N J Oncology Center shelter for radiation treatment. The minimum requirement is 200 but we are trying to raise money for at least 100 blankets.
Each blanket cost would be Rs. 115 (from our regular supplier). We are trying other sources as well. The price can be Rs. 100 to Rs. 105. Not sure yet.
If we assume the price would be Rs. 115 only, we should raise Rs. 11,500 for 100 blankets and Rs. 23,000.
TO MAKE A DIFFERENCE (TMAD)
A/C No: 000801210382
Bank: ICICI Bank Limited
Branch: CIBD (Khairatabad)
NEFT/IFSC/RTGS Code: ICIC0000008
Pl. send mail to tmad.finance@gmail.com with the subject line as: For Blankets in M N J, with the transaction details, as soon as you transfer the amount. We will confirm the transaction within 48 hrs and send the receipt within 15 days. We have 80G Tax Exemption.

Thursday 15 December 2011

బ్నిం గారితో రేడియో జోష్ ముచ్చట్లు


రేడియో జోష్...



ఇవాల్టి నుండి వరుసగా నాలుగు రోజుల పాటు స్టేట్ ఆర్ట్ గ్యాలరీ మాదాపూర్ లో కలర్ స్కేప్స్ అనే పేరుతో ముఖీ మీడియా వారి సౌజన్యంతో చిత్రకళా ప్రదర్సన ఏర్పాటు చేయబడుతుంది. ఈ కళాప్రదర్శనలో వేర్వేరు ప్రాంతాల నుండి వచ్చిన సుమారు 40 మంది చిత్రకారుల 400 పైగా చిత్రాలను ప్రదర్శనలో ఉంచుతున్నారు. ప్రముఖ చిత్రకారుడు , దర్శకుడు బాపుగారి జన్మదిన సందర్భంగా ఈరోజు సాయంత్రం ఈ కళాప్రదర్శన ప్రారంభించబడుతుంది. ఈ చిత్రాలన్నీ ప్రదర్శనకే కాకుండా అమ్మకాలు కూడా ఉంటాయని నిర్వాహకులు ముఖీ మీడియా వారు తెలియచేసారు. ఈ కళా ప్రదర్శనకు రేడియో జోష్ రేడియో పార్టనర్ గా ఉంది.. ఈ రోజు సాయంత్రం జరిగే ప్రారంభ కార్యక్రమ విశేషాలు రేడియో జోష్ లో ప్రత్యక్షంగా వినొచ్చు.. ఈ సందర్భంగా నాలుగు రోజుల క్రింద అంటే ఆదివారం సాయంత్రం ముఖీ మీడియా CEO పావని ప్రసాద్ గారు, ప్రముఖ రచయిత,కార్టూనిస్ట్ బ్నిం గారు రేడియో జోష్ స్టూడియోకి వచ్చారు. ఆ ఇంటర్వ్యూ మీరు వినండి మరి..

ఒక surprise.... ఈ ఇంటర్వ్యూలో మనందరికీ ఇష్టమైన వ్యక్తి ఒకరు వచ్చి కొన్ని ముచట్లు చెప్తున్నారు మరి..





రేడియో జోష్ లో ప్రతీ ఆదివారం సాయంత్రం 7.30 గంటలకు బ్నిం ఆడియో కథలు ప్రసారం చేయబడతాయి. మర్చిపోకుండా వినండి..

మాలిక పదచంద్రిక - 4 ఫలితాలు


మాలికా పదచంద్రిక - 4 కు ఆరుగురు సమాధానాలను పంపారు. బి.పద్మావతిగారు ఒక తప్పుతోనూ, భైరవభట్ల కామేశ్వరరావుగారు, భమిడిపాటి సూర్యలక్ష్మిగారు రెండేసి తప్పులతోనూ పూరించగలిగారు. ఇక అన్నీ సరిగ్గా పూరించి బహుమతికి అర్హులైవారు మాచర్ల హనుమంతరావు గారు, కంది శంకరయ్యగారు మరియు మానస చామర్తి గారు. వీరికి అభినందనలు. బహుమతి ఈ ముగ్గురికి సమానంగా ఇవ్వబడుతుంది.

విజేతలు editor@maalika.org కి మీ చిరునామాలు పంపండి.

Tuesday 13 December 2011

పాఠకుడి దగ్గరకు పుస్తకం... సుపధ


సుపధ :


కొన్నేళ్లుగా ప్రతీ సంవత్సరం డిసెంబర్ నెల రాగానే చదివే అలవాటు ఉన్నవారికి, హైదరాబాదులో ఉన్నవారికి గుర్తొచ్చేది, ఎదురు చూసేది ఏంటి? పుస్తకాల పండగ అదేనండి పుస్తక ప్రదర్శన..


పుస్తకాలు చదవడం అందరికీ ఇష్టమే. క్లాసు పుస్తకాలైతే ఎలాగూ తప్పవనుకోండి. చదువు, వృత్తికి సంబంధించిన పుస్తకాలే కాకుండా మనకు నచ్చిన అంశాల మీద మరింతగా తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. దానికోసం వీలైనన్ని పుస్తకాలు కొంటుంటాము. అవి సంగీతం, సాహిత్యం, పిల్లల కథలు, వంటలు, కుట్లు అల్లికలు, ఆరోగ్యం, ఆధ్యాత్మికం మొదలైనవెన్నో అంశాల మీద రాసిన పుస్తకాలు ఉంటాయి. వీటిని కొనుక్కోవడానికి పుస్తకాల షాపుకు వెళ్లాల్సిందే .. లేదా ఏడాదికోసారి ప్రముఖ పట్టణాలలో ఏర్పాటు చేసే పుస్తక ప్రదర్శనల్లో తమకు కావలసిన, నచ్చిన పుస్తకాలు దొరుకుతాయేమో అని వెతుక్కోవాలి. ప్రతీ నగరంలో కూడా పుస్తకాలు చదివే అలవాటు ఉన్నవారు ప్రతీ కాలనీలో, వీధిలో ఉంటారు . కాని ఆ పుస్తకాలు కొనడానికి దుకాణాలు మాత్రం కొన్ని చోట్లే ఉన్నాయి. ఉదా. దిల్‌షుక్ నగర్, లేదా BHEL, ECIL లో ఉన్నవారికి ఏదైన పుస్తకం కావాలంటే కోటీలోని విశాలాంధ్ర, లేదా నవయుగ, నవోదయకు రావాల్సిందే. మధ్యలో కొన్ని ఉంటాయి కాని అన్ని పుస్తకాలు దొరక్కపోవచ్చు. అడ్రస్ తెలియకపోవచ్చు. అలాంటప్పుడు ఎంత దూరమైనా వెళ్లక తప్పదు కదా. అప్పుడప్పుడు పావల కోడికి ముప్పావలా మసాలా అన్నట్టు అవుతుంది కూడా. అందుకని ఒకేసారి కనీసం పది పుస్తకాలైనా కొనేట్టుగా డబ్బులు జమచేసుకుని, సమయం చూసుకుని, ప్రయాణం పెట్టుకోవాల్సి ఉంటుంది. అంతవరకు ఆ పుస్తకం చదవాలనే కోరికను ఆపుకోవాల్సిందే.


ఈ మధ్య పుస్తకాలు చదివే అలవాటు చాలా తగ్గిపోయింది అంటున్నారు కాని అది తప్పేమో?... చదివేవాళ్లూ ఉన్నారు, రాసే వాళ్లూ ఉన్నారు. ప్రతీ దిన,వార, మాసపత్రికల్లో ఎన్నో కొత్త పుస్తకాల సమీక్షలు, పరిచయాలు వస్తూనే ఉన్నాయి కదా. అవి ఎంత వరకు అమ్ముడుపోతున్నాయో తెలీదు మరి. లక్షలు ఖర్చు పెట్టి తమ పుస్తకాలు అచ్చు వేయించుకున్నా కనీసం పెట్టిన ఖర్చైనా వస్తుందంటే డౌటే. చాలా వరకు స్నేహితులు, తెలిసినవాళ్లకు ఉచితంగానే ఇస్తారు రచయితలు. మిగిలినవి ఇంట్లో అట్టి పెట్టుకుంటారు. ఎవరో కొందరు పేరు పొందినవారి రచనలు హాట్ కేకుల్లా అమ్ముడవుతాయనుకోండి. అది వేరే మాట. అచ్చైన పుస్తకాలన్నీ మనకు తెలివు. తెలిసినా కొనలేము. అన్నీ అన్ని చోట్లా దొరకవు. ప్రముఖ నగరాల్లో ఉన్నవారు ఉన్న కొద్ది షాపుల్లో గాని, పుస్తక ప్రదర్శనల్లో కాని కొనేసుకుంటారు. కాని వేరే ప్రాంతాల్లో , విదేశాల్లో ఉన్నవారి సంగతేంటి?? ఈ మధ్య బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది ebooks .. పుస్తకాలను పిడిఎఫ్ లా ebooks చేసి పంపిణీ చెస్తున్నారు. కాని అస్తమానం కంప్యూటర్ ముందు మంచి పుస్తకం చదవాలంటే ఎవరికైనా విసుగే కాని గత్యంతరం లేక చదివే అలవాటు వదులుకోలేక అలా సర్దుకుపోతుంటారు. Amazon, AVKF ద్వారా కూడా తెలుగు పుస్తకాల పంపిణీ జరుగుతుంది. అది కొంచం ఖరీదైన వ్యవహారం.. ఎమెస్కో వాళ్లు చాలా ఏళ్ళుగా ఇంటింటికి గ్రంధాలయం అనే పధకం నడిపేవారు. ఏమో మరి ఈ మధ్య ఆ పధకం ఆపేసారు. అందులో వాళ్లు ఆయా నెలలో ప్రచురించిన, వారి దగ్గర ఉన్న పుస్తకాలు మాత్రమే మనం ఇంటికి తెప్పించుకోగలం..


అలా కాకుండా మనకు నచ్చిన పుస్తకాన్ని ఇంట్లో కూర్చునే ఆర్డర్ చేసి ఎక్కువ ఖరీదు కట్టకుండానే ఇంటికి తెప్పించుకునే అవకాశం వస్తే ఎలాగుంటుంది??


ఈ సమస్యలకు తగిన పరిష్కారం లభించింది.


పల్లవి , తన్మయి అనే ఇద్దరమ్మాయిలు తమ ఉద్యోగాలతో విసిగిపోయి ఏదైన కొత్తగా చేయాలనుకుని సలహ కోసం తండ్రిని అడిగారు... అపుడు అయన చెప్పిన మాట ........... కోరుకున్న పుస్తకాన్ని కోరినవారి ఇంటికి చేర్చే పథకం ఆలోచించమన్నాను. తెలుగు పుస్తకాలు అమ్ముడుపోవు , పుస్తక ప్రచురణ ఆర్థికంగా గిట్టుబాటు కాదు అని నిర్ధారణకు వచ్చి రచయితలు , చిన్న పబ్లిషర్లు చాలామంది నిస్పృహ చెందుతున్న ఈ కాలంలో యువత ముందుకొచ్చి కొత్త ఆలోచనతో ,కొత్త మార్కెటింగ్ వ్యూహంతో ఏదైనా సీరియస్ గా చేపడితే తెలుగు సాహిత్యానికి ఎంతో కొంత మేలు జరుగుతుంది అని చెప్పారు. ఆ ఆలోచన అమలు చేసిన ఆ అమ్మాయిలు మొదలుపెట్టిన కొత్త వెబ్ సైట్... సుపథ


ఈ సైట్ మొదలుపెట్టడానికి గల కారణాల గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం..


ఇది మామూలు పుస్తకాల దుకాణం కాదు.పెద్ద పబ్లిషర్లకు,పెద్ద బుక్ సెల్లర్లకు పుస్తకాలను అమ్మిపెట్టి లాభపడటానికి దీన్ని మొదలెట్టలేదు. ప్రతి పుస్తకాల అంగడిలో రివాజుగా ప్రదర్శించే పుస్తకాలన్నిటినీ ఇక్కడ కూడా ఎక్కించటం మా ధ్యేయం కాదు. తెలుగు పుస్తకప్రచురణ ఇప్పుడున్న స్థితిలో రచనా వ్యాసంగం ఆర్థికంగా గిట్టుబాటుకాక , ప్రాచుర్యం పెద్దగా లేక అవస్థ పడుతున్న ఎందరో రచయితల సమస్యకు ఒక పరిష్కారం కనుగొనాలన్న ఆలోచన ఈ ప్రయత్నానికి ప్రేరణ.



నేరుగా రచయితలనుంచి ,చిన్న పబ్లిషర్ల నుంచి పుస్తకాలను సేకరించి ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ లోనూ ,ఇతర విధాలుగానూ విక్రయించి, క్రమప్రకారం రచయితలకు, లేదా వారికి సంబంధించిన పబ్లిషర్లకు చెల్లించాలని మా సంకల్పం. అలాగే లాభాపేక్ష లేక సేవాభావంతో మంచి పుస్తకాలను అతితక్కువ ధరకు అందిస్తున్నా, మార్కెటింగు మీద దృష్టి పెట్టే సావకాశంలేని పబ్లిక్, ప్రైవేట్ సంస్థలకు వీలైనమేరకు ఉపయోగపడాలని మా ఆశయం.ఒక్క మాటలో చెప్పాలంటే మంచి రచయితకు తోడ్పడి, మంచి పబ్లిషర్లకు సహాయపడి మంచి తెలుగు సాహిత్యాన్ని విశ్వవ్యాప్తం చేయాలన్న ధ్యేయంతో ఏర్పరచిన రచయితల సహకార వేదిక ఇది.


ఎన్ని వేల పుస్తకాలను నెట్లోకి ఎక్కించామన్నది కాదు..ఎన్ని మంచి పుస్తకాలకు ప్రపంచ ప్రాచుర్యం కల్పించగలిగామన్నదే మాకు ముఖ్యం.అవకాశం ఉన్న మేరకు రచయితలను, ప్రచురణకర్తలను సంప్రదించి,కలిసి వచ్చినవారికి వచ్చినట్లు ఇక్కడ స్థానంకల్పించాం. మిగతా రచయితలకూ, పబ్లిషర్లకూ ఇదే మా స్వాగతం.




ఏది పడితే అది కాకుండా పుస్తకాల ఎంపికలో కనీస ప్రమాణాలను పాటించ దలిచాం. ఉండకూడదని మీరు భావించిన పుస్తకాలేవైనా ఇక్కడ మీకు కనపడినా ,ఫలానా పుస్తకాలు ఇక్కడ ఉండదగినవని మీరు అనుకున్నా దయచేసి మాకు రాయండి.


మీరు ప్రత్యేకంగా ఏదైనా పుస్తకం కొనాలని అనుకుంటూంటే దాన్ని ఇక్కడ అమ్మకానికి పెట్టకపొయినా ,దయచేసి మాకు రాయండి ( info@supatha.in). మార్కెట్లో ఉన్నా లేకున్నా ఎలాగైనా దాన్ని సంపాదించి మీకు పంపడానికి ప్రయత్నిస్తాం.



ప్రధానంగా తెలుగు పుస్తకాలకోసమే దీన్ని ఉద్దేశించినా,ఇతర భాషా గ్రంథాలకు చోటు పెట్టరాదన్న నిషేధం లేదు.మంచి పుస్తకాలు ఏ భాషలో ఉన్నా ఆయా రచయితలు,పబ్లిషర్లు కోరితే ఇక్కడ పెడతాం.



ఇంకా చాలా ఆలోచనలున్నాయి.



మీరు కూడా ఈ సైట్ చూసి పుస్తకాలు ఇంటికే తెప్పించుకోండి మరి.. ఇది ఆన్లైన్ అమ్మకాలు మాత్రమే కాదు. ముందు ముందు మరింతగా విస్తృత పరుస్తామని నిర్వాహకులు తెలియచేసారు..

మెయిల్ ఐడి : sales@supatha.in
durgapublications@gmail.com

ఫోన్:
9441257961
9441257962
9441257963


20052824.

Tuesday 6 December 2011

ఆదిలక్ష్మి గారు వస్తున్నారంట...

ఆ భగవంతుని దయ వల్ల అమ్మ ఒడి బ్లాగర్ ఆదిలక్ష్మిగారు కోలుకున్నారు. త్వరలో బ్లాగు కూడా రాయడం మొదలుపెడతారంట.చందమామ రాజుగారు ఇచ్చిన సమాచారం ఇది.. బ్లాగు మిత్రులు ఆవిడకు కాల్ చేసి మాట్లాడితే మనమంతా ఆమెకు తోడుగా ఉన్నామని సంతోషిస్తారు..

మనందరికీ మంచివార్త. అమ్మ ఒడి ఆదిలక్ష్మి గారు స్వస్థత పొంది మళ్లీ మనముందుకు రావాలనుకుంటున్నారు. ఇవ్వాళే ఈ విషయం తెలిసింది. ఇన్నాళ్లుగా ఆమె వివరాలకోసం ప్రయత్నించినా దొరకలేదు. ఆదిలక్ష్మి గారి రచనలను, వారి కుటుంబాన్ని బాగా అబిమానించే రేణు కుమార్ గారు ఆమె వివరాలను తెలిపారు. ఆమె ప్రస్తుతం వికారాబాద్ సమీపంలోని ఓ అనాధాశ్రమంలో 50 మంది పిల్లల మధ్య జీవితం గడుపుతున్నారు.

పాప, భర్త.. జీవితంలో అన్నీ కోల్పోయి కూడా తేరుకుని మళ్లీ తన బ్లాగ్ నిర్వహణకు, రచనల కొనసాగింపుకోసం పట్టుదలతో ఉన్నారు. కూడూ, గూడూ కూడా లేని స్థితిలో ఇప్పుడు జీవిస్తున్నానని తన కంటూ ఒక జీవితం, ఉపాధి కల్పించుకుని బ్లాగ్ నిర్వహణను క్రమం తప్పకుండా సాగించాలని ఆమె బలంగా కోరుకుంటున్నారు. ఇటీవలే సెవెన్స్ సెన్స్ సినిమా చూసి రీఛార్జ్ అయ్యానని ఆమె అన్నారు. తొమ్మిది రాజ్యాలు కలిసి ఒక రాజ్యం మీద దాడి చేయడం యుద్ధం అనిపించుకోదని అది ద్రోహం, కుట్రపూరితమేనని ఆమె అన్వయించుకుని చెప్పారు. తన బ్లాగులో వైఎస్ మరణం తర్వాత రాజకీయ కథనాలు ఎక్కువగా జోడించానని, ఇప్పడు తాను కోలుకున్న తర్వాత హైందవమతంపై ముప్పేట దాడుల పర్యవసానాల గురించి విస్తృత రచనలకోసం ప్రణాళిక ఊహించుకుంటున్నానని బ్లాగ్ మిత్రుల సహాయం తనకు చాలా అవసరమని ఆమె ఫీలవుతున్నారు. మీకు వీలయితే ఆమె కొత్త ఫోన్‌నంబర్‌కు ఒకసారి కాల్ చేసి మాట్లాడగలరు.

9603419294


జీవని ప్రసాద్ గారు , మీరు గతంలో జీవని వారి నుంచి ఆమెకు స్కూల్‌లో ఉపాధి లభించే అవకాశం ఉందని చెప్పినట్లు గుర్తు. పునరుజ్జీవితం పొందిన ఆదిలక్ష్మి గారికి మీరు ఈ రకమైన చేయూతను ఇప్పించగలిగితే చాలా బాగుంటుందని నా అభిప్రాయం.


తన రచనలు, టైపింగ్, టెక్నాలజీ వంటి విషయాల్లో ఆమె తన సహచరుడు లెనిన్ బాబు గారిపైనే పూర్తిగా ఆధారపడ్డారు కాబట్టి సెల్, కంప్యూటర్ టెక్నాలజీ రెండింటినీ తాను ఇప్పుడు ఓనమాల నుంచి నేర్చుకోవలసి ఉంటుందని ఆమె ఫీలింగ్. ఆమె గత కొన్నేళ్ళుగా అమ్మఒడి బ్లాగులో రాసిన వందలాది బృహత్ కథనాలను మొత్తంగా లెనిన్ బాబుగారే టైప్ చేశారట. ఇప్పుడు ఒంటరిగా మారడంతో అన్నీ ఈమె నే్ర్చుకోవలసి ఉంటుంది.

వీలైతే మీరు ఇవ్వాళే ఆమెకు కింది మొబైల్ నంబర్‌కు ఫోన్ చేసి మాట్లాడగలరు. ఆమెతో, ఆమె రచనలతో పరిచయస్తులుగా మనం చేసే గడ్డిపరక సహాయం కూడా ఆమెకు కొండంత అండగా నిలబడుతుందని నా ప్రగాఢ నమ్మకం. ఆమె తన స్వంత కష్టంతో జీవించేలా ఏదయినా ఏర్పాటు చేయగలరేమో ఆలోచించండి. వెంటనే కాకపోయినా కాస్త ఆలస్యమయినా ఈ విషయంపై మీరు తప్పక ఆలోచించగలరు.

వీలైతే ఇవ్వాళే ఆదిలక్ష్మి గారితో కింది నెంబర్‌కు కాల్ చేసి మాట్లాడగలరు.
9603419294

వీలైతే ఈరోజు రాత్రిలోపు ఆమె క్షేమ సమాచారం గురించి నా బ్లాగు ద్వారా అందరికీ తెలియపర్చాలని ఉంది. ప్రయత్నిస్తాను.

తప్పకుండా మీరు ఈ విషయంలో సహాయహస్తం అందించగలరని ఆశిస్తూ..
రాజు.

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008