Wednesday 25 June 2008

ప్రమదావనంలో విశిష్ట వ్యక్తి ....

ఆదివారం 22.6.08 నాడు జరిగిన ప్రమదావనం సమావేశానికి తమ వ్యక్తిగత పనుల వల్ల ఎక్కువమంది సభ్యులు రాలేకపోయారు. మూడు వారాలుగా నెట్‌వర్క్ సతాయిస్తున్న తెరెసా ఈసారి మాత్రం వచ్చారు కాని ఆవిడ అంకోపరి తరచూ తంతూ ఉండింది. ఐనా స్నేహితులతో ముచ్చట్లు ఎలా వదలబుద్ధి అవుతుంది. జ్ఞాప్రసూనగారు , వరూధిని వచ్చారు. చివర్లో పద్మ గారు వచ్చారు. అవిడ మోహనరాగాలు అనే బ్లాగు రాస్తారు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో ఉంటారు. వృత్తి బ్రాహ్మిణి. ఈ సమావేశం కోసం అలారం పెట్టుకుని మరీ నిద్ర లేచి వచ్చేసారు. పరిచయాలు, ముచ్చట్లు అవి అవుతుండగానే వరూధినిగారిని ఉష్ష్ణపీటం పై కూర్చోబెట్టడం జరిగింది. ఈ రోజు వరూధినిగారిలోని ఒక విశిష్ట వ్యక్తిత్వాన్ని తెలుసుకోగలిగాము. ఆవిడ భర్త ప్రముఖ బ్లాగరు, వికిపీడియన్ ఐనా ఆ వివరాలేమీ చెప్పకుండా , సరిగమలు బ్లాగు మొదలెట్టి తనకంటూ ఒక గుర్తింపు లభించాకే ఆవిడ పేరు వివరాలు మనందరికి తెలిసాయి. హ్యాట్స్ ఆఫ్ వరూధినిగారు. ఆవిడ కోరికపై ఆ వివరాలు నివేదికలో ఇవ్వడం లేదు. చివర్లో వరూధినిగారు ఒక సూచన చేసారు. ప్రమదావనం వారానికొకసారి కాకుండా నెలకు రెండుసార్లు పెట్టుకుంటే బాగుంటుంది. అలాగే ముఖ్య అథితిగా బ్లాగర్లనే కాకుండా, బయటివారిని అంటే తమ తమ వృత్తులలో పేరు సంపాదించినవారిని పిలిస్తే బావుంటుంది అన్నారు. ప్రయత్నించాలి.

0 వ్యాఖ్యలు:

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008