Monday 31 December 2007

కొత్త సంవత్సర బాంబ్ బ్లాస్ట్...

Bomb Chain

Powered by: MySpace Games

మీ శ్రేయోభిలాషి




నటీనటులు:

డా.రాజేంద్ర ప్రసాద్,నరేష్,బ్రహ్మానందం,కృష్ణ భగవాన్, రఘు బాబు,ఆలీ మొదలైనవారు.

దర్శకుడు :

ఈశ్వర్ రెడ్డి.

మనకోసం కాకుండా ఇతరులకోసం జీవించేదే నిజమైన జీవితం అనే మంచి సందేశాన్ని ఇచ్చే సినిమా "మీ శ్రేయోభిలాషి" చిత్ర కథానాయకుడైన రాజాజి (రాజేంద్రప్రసాద్) అలాంటి వ్యక్తి. ఎప్పుడూ తన చుట్టు ఉన్నవారి కష్టసుఖాలు తెలుసుకుని వాళ్ళకు సహాయపడేవాడు. ఇది ఒక సందేశాత్మక సినిమా ఐనా అందరూ తప్పక చూడవలసిన సినిమా.ఈ విషయంలో చిత్ర నిర్మాత, దర్శకులు కృతకృత్యులయ్యారని చెప్పవచ్చు.

రాజాజి ఒక ప్రొఫెసర్. పెళ్ళైన రెండేళ్ళకే భార్యను కోల్పోతాడు. మళ్ళీ పెళ్ళి చేసుకోకుండా తన కూతురిని అల్లారు ముద్దుగా పెంచుతాడు. కాని దురదృష్టవశాత్తు ఆ అమ్మాయి ప్రేమలో విఫలమై ఆత్మహత్య చేసుకుంటుంది.దానితో అతను మిగిలిన తన జీవితాన్ని ఇతరుల కోసమే అంకితం చేస్తాడు. జీవితాన్ని ఎలా జీవించాలి, ఏది సరైనది ఏది కాదు అని అందరికీ చెప్తుంటాడు. అలా ఓ పదిమంది వ్యక్తులను కలుసుకుంటాడు. వాళ్ళందరూ తమ జీవితంలోని రకరకాల సమస్యలతో (అప్పులు,గుండె జబ్బులు,అవమానాలు)విసిగిపోయి చావాలని నిర్ణయించుకున్నవాళ్ళే. వాళ్ళను మాటలతో మార్చాలని శతవిధాలా ప్రయత్నించి నిరాశ చెందిన రాజాజి వాళ్ళకొక గుణపాఠం నేర్పాలని నిశ్చయించుకుని వాళ్ళ చావుకు వాళ్ళే పథకం వేసుకునేలా చేస్తాడు. అందరూ ఒక బస్సులో వెళ్ళి కొండపైనుండి పడిపోయేలా చేసి యాక్సిడెంట్ లా చేయాలని అందరూ నిర్ణయించుకుంటారు. ఆ బస్సు ప్రయాణంలో జరిగే సంఘటనలే ఈ చిత్ర కథలోని ముఖ్య సన్నివేశాలు. ఈ చిత్రంలో సస్పెన్స్ కూడా బాగానే పండించారు. రాజేంద్ర ప్రసాద్ కూడ చాలా బాగా నటించాడు.మిగతా నటీనటులు కూడ తమ పాత్రలను సమర్ధవంతంగా పోషించారు.కుటుంబ కథాచిత్రమని చెప్పవచ్చు.కుర్రకారుకు నచ్చకపోవచ్చేమో మరి.

Saturday 29 December 2007

నాకు నచ్చిన పాట...

చౌద్వీన్ కా చాంద్


నాకు చిన్నప్పటినుండి పాటలు ఇష్టమే.కాని ప్రత్యేకంగా ఒకటని లేదు. కాని ఇంటర్‌లో ఉండగా నా స్నేహితురాలు రఫీ పాటల క్యాసెట్ ఇచ్చింది వినమని. ఈ పాట వినగానే ఎందుకో చాలా నచ్చింది. సంగీతం కానీ, సాహిత్యం కానీ మనసుకు హత్తుకున్నాయి. అందులో పదాలు అర్ధం కాకున్నా చాలా మంచి సాహిత్యం అని అప్పుడే అనుకున్నా. తర్వాత మా నాన్నతో చెప్పి రఫీ పాటల క్యాసెట్ తెప్పించుకుని వినేదాన్ని.అప్పట్లో LP రికార్డులు ఎక్కువ. అలా రఫీ పాటలంటే చెవి కోసుకునేదాన్ని అప్పటినుండీ. ఎవరిదగ్గరున్నా తెచ్చుకుని రికార్డ్ చేసుకోవడం. కాని ఈ పాట మాత్రం నాకు ప్రాణం. నిజంగా ఈ పాట వింటుంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఈ సినిమాలో వహీదా ఎంత అందంగా, ముద్దుగా ఉందో.

చౌద్వీన్ కా చాంద్ హో, యా ఆఫ్తాబ్ హో
జో భి హో తుమ్ ఖుదా కి కసం, లాజవాబ్ హో - 2

జుల్ఫే హై జైసె కాంధో పె బాదల్ ఝుకే హుయే
ఆంఖేన్ హైన్ జైసె మెకే ప్యాలే భరె హుయే
మస్తి హై జిస్‌మె ప్యార్ కి తుం వో షరాబ్ హో
చౌద్వీన్ కా చాంద్ హో ...

చెహ్రా హై జైసే ఝీల్ మే ఖిల్తా హువా కన్వల్
యా జిందగి కే సాజ్ పె చేడీ హుయీ ఘజల్
జానే బహార్ తుమ్ కిసి షాయర్ కా ఖ్వాబ్ హో
చౌద్వీన్ ఖా చాంద్ హో ...

హోఠొన్ పే ఖేల్‌తీ హైన్ తబస్సుమ్ కి బిజ్లియాన్
సజ్‌దే తుమ్హారి రాహ్ మె కర్‌తీ హైన్ ఖైకషాన్
దునియా-ఏ-హుస్నో-ఇష్క్ కి తుమ్ హీ షబాబ్ హో
చౌద్వీన్ కా చాంద్ హో ...



Friday 28 December 2007

బ్లాగ్విషయం




క్రితం సారి ఇచ్చిన బ్లాగ్విషయం "స్నేహం" . దానికి (కొంచెం మంచి స్పందన వచ్చింది. ఈసారి మనం "నాకు నచ్చిన మధురమైన పాట" అనే విషయం మీద బ్లాగుదామా? ఇదివరకే చావాకిరణ్ , సుధాకర్ తమ బ్లాగులలో వారికి నచ్చిన గీతాలను రాసారు. మిగతావారు కూడా ఫాలో అయిపోండి మరి.. మరో ముఖ్య గమనిక.ఇది అందరు బ్లాగర్లు (కొత్త, పాత అని తేడా లేదు) పాల్గొనాల్సిన కార్యక్రమము. ఎప్పుడు మీ ఆలొచనలనే బ్లాగుకెక్కిస్తే ఎలా అండీ. ఇలా అందరం ఒకే విషయం మీద కలసికట్టుగా బుర్రను బద్దలు కొట్టుకుని(అవసరం లేదనుకుంటా) రాద్దాము.

నిరంతర విద్యార్థిగా ఉండండి...

విజ్ఞానానికి అంతం ఉండదు. ఏ వ్యక్తీ ఏ రంగంలోనూ నేర్చుకోవడానికి ఇంకేమీ లేనంత నిష్ణాతుడైపోడు. అయినా మనందరం మనకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో అంతా తెలిసిందే కదా, ఇంకేముంది నేర్చుకోవడానికి అన్నంత అవివేకంతో వ్యవహరిస్తుంటాం. అలాగే మన రంగం గురించి తప్ప ఇతర రంగాల గురించి చర్చ వచ్చినప్పుడు 'మనకెందుకులే' అన్నట్లు నిరాసక్తత ప్రదర్శిస్తుంటాం. ఏదో ఒక అంశంపై నిరంతరం మెదడుకు పదును పెట్టడం వల్ల పరిణతిని సాధించగలం. కొద్దిపాటి పరిజ్ఞానంతో ఇతరుల అభిప్రాయాలను కొట్టిపారేయడం, మనకు తెలిసిందే వేదం అనుకోవడం, కనీసం వాస్తవాలను జీర్ణించుకోలేకపోవడం మన ఆలోచనా పరిధిని మనం పరిమితం చేసుకుంటున్నట్లే! నిరంతర విద్యార్థిగా ఉన్న వ్యక్తులు మాత్రమే సమాజంలో నెగ్గుకురాగలరు. కొత్త విషయాలను నేర్చుకోవడాన్ని నామోషీగా భావించడం వల్ల భవిష్యత్‌లో ఎప్పుడైనా వాటి అవసరం వచ్చినప్పుడు తెల్లమొఖం వేయవలసి వస్తుంది. సమాజంలో విభిన్న వ్యక్తులతో సంభాషించేటప్పుడు మీ దృష్టికి వచ్చే అనేక అంశాలపై అప్పటికప్పుడైనా ఓసారి దృష్టి సారించండి. తెలియని విషయాలు ఇతరుల్ని అడిగి తెలుసుకోవడానికి మొహమాటం పడడం మంచిది కాదు. ఎవరూ చెప్పనిదే ఎవరికీ ఏమీ తెలియదు. అడిగి తెలుసుకోవడం, అలా తెలుసుకున్న దాన్ని విశ్లేషించడం, ఓ అభిప్రాయాన్ని మనసులో కల్పించుకోవడం, మరోసారి ఎప్పుడైనా అదే విషయం వేరే వ్యక్తుల వద్ద ప్రస్తావనకు వచ్చినప్పుడు అక్కడ జరిగే చర్చతో మన అభిప్రాయాలను బేరీజు వేసుకోవడం, వాస్తవాలను నిర్ధారించుకోవడం... ఇలా నిరంతరం మైండ్‌ని మెరుగుపరుచుకుంటూ పోవాలి.

నల్లమోతు శ్రీధర్

Thursday 27 December 2007

చాటువులు....

సుమరు ఆరువందల సంవత్సరాలకు మించి ఆంధ్ర సాహితీ వినీలాకాశంలో శోభాయమానంగా ప్రజ్వలించి తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్న మహాకవి శ్రీనాధుడు.

మన ఆంధ్రకవులు ఎన్నో ఏళ్ళనుంచి తమ కవితామృత ధారతో తెలుగు రసిక హృదయ కేదారాలలొ పసిడి పంటలు పండిస్తూనే ఉన్నారు. ఈ మహా కవులు తమ కావ్యాలలో ఇతివృత్తానికీ, కవితా పారమ్యానికీ ప్రాముఖ్యమిచ్చారు తప్ప వైయక్తిక అనుభూతులకు ఎక్కడోగాని తావీయలేదు. వాళ్లకు కోపమో, తాపమో,అనురాగమో, ఆనందమో, అవహేళనాభావమో, భక్తిభావమో కలిగినప్పుడు అప్పటికప్పుడు తమకు కలిగిన అనుభూతులు పద్యాలుగా అవతరించాయి. వీటినే చాటువులంటారు.

అందరికీ అర్ధమయ్యేలా భావాల్ని పొందుపఱచి తమ ప్రజ్ఞాపాటవాలను చూపిస్తూ అందులో ఇంకొంచెం ప్రాణంపోసి ప్రచారంలోకి తెచ్చి శాశ్వతంగా ప్జ్రజల హృదయాంతరాళల్లో నిలిచిపోయేలా, వారి ఆలోచనారీతులను ప్రభావితం చేసేలా మనకు మిగిలిన , మన పెద్దలు మిగిల్చిన చద్ది మూటలు ఈ చాటుపద్యాలు. ఒకచోట చమత్కారం, ఒకచోట భావ విన్యాసం ఇంకోచోట వెక్కిరింపు, సాధింపులు,ఇంకొకచోట వ్యంగం,విరుపులు, ఇలా సన్నివేశానికి బలం చేకూర్చేలా ప్రాణంతో కదలాడే శబ్ద సమూహాలు ఈ చాటువులు.


ఉబికి వచ్చిన భావాన్ని పద్యంగా మలచి చిమ్మివేయడమే తప్ప ఇతరేతరమైన ఏ నియమ నిబంధనలకు ఒదగనిది చాటుపద్యం. సామెతకున్న సంక్షిప్తత, సూటిదనం, జనప్రియత్వం, స్పూర్తి, నిస్ప్రయత్నంగా ప్రాచుర్యాన్ని సంపాదించుకునే శక్తి చాటుపద్యానికుంటాయి. సూక్తిని చమత్కృతం చేయడం చాటువు లక్షణం.అందువల్ల ఆశువుకంటే చాటువుకు ఆయుష్షు ఎక్కువ. చాటువులో అందమైన వస్తువుకంటే అందంగా చెప్పిన పద్ధతికే ప్రాముఖ్యం అంటే రుచికరం కాని వస్తువును రుచికరంగా చెప్పే సూక్తిధారి ఈ చాటువు.

చాటుః అనే సంస్కృత పదానికి 'చాటువు ' అనేది తత్సమ రూపం.చాటువు అంటే ప్రియమైన లేదా ఇష్టమైన మాట.

కొన్ని చమత్కార చాటువులు...

శివుడద్రిని శయనించుట
రవిచంద్రులు మింటనుంట రాజీవాక్షుం
డవిరళముగ శేషునిపై
బవళించుట నల్లి బాధ పడలేక సుమీ!


నల్లి బాధ పడలేకనే శివుడు కొండలపై, రవిచంద్రులు ఆకాశాన, విష్ణువు ఆదిశేషునిపై పడుకున్నారని భావం.

ఇంటావిడ పోరు పడలేక ఒక కవి ఇలా చెప్పాడు..

మశకా మత్కుణా రాత్రౌ మక్షికా భిక్షుకా దివా
పిపీలికా చ భార్యా చ దివారాత్రం ప్రబాధతే !!


'దోమలు, నల్లులు రాత్రి మాత్రమే బాధిస్తాయి. ఈగలు, యాచకులు పగలు మాత్రమే బాధిస్తారు. చీమలు, భార్య రాత్రింబవళ్ళు వేధిస్తారు ' అని భావం.


ఇక శ్రీనాధుని చాటువులు కొన్ని చూద్దామా!..

కుల్లాయుంచితి, గోకజుట్టితి, మహాకూర్పాసముందొడ్గితిన్
వెల్లుల్లిన్ దిలపిష్టమున్ మెసవితిన్ విశ్వస్త వడ్డింపగా
చల్లాయంబలి ద్రాగితిన్, రుచుల దోసంబంచు బోనాడితిన్
దల్లీ! కన్నడ రాజ్యలక్ష్మి! దయలేదా? నేను శ్రీనాధుడన్!


శ్రీనాధుడు ప్రౌడదేవరాయ సందర్శనాభిలాషియై విద్యానగరము వెళ్ళినప్పుడు జరిగిన మర్యాదలివి. కన్నడ మర్యాదానుసారం శ్రీనాధునికి కొత్త సంప్రదాయాలైన తలకు కుళ్ళాయి(తలపాగా), మేనికి అంగరఖాను ధరించవలసి వచ్చింది. శ్రీనాధుడు వేదాధ్యయన సంపన్నుడు కావడంవల్ల శిష్టుడు. శిష్టులు సకేశలైన వితంతువుల చేతి భోజనం అంటరు. ఈ దురవస్థ శ్రీనాధులవారికి కన్నడ రాజ్యంలొ సంప్రాప్తించింది. అందుకే కన్నడ రాజ్యలక్ష్మితో మొరపెట్టుకున్నాడు.


మేత గరి పిల్ల, పోరున మేక పిల్ల,
పారుపోతుతనంబున బంది పిల్ల,
యెల్ల పనులను జెఱుపంగ బిల్లి పిల్ల,
యందమున గ్రోతిపిల్ల యీ యఱవ పిల్ల!


దక్షిణ దేశ సంచార సమయంలొ ఒక అఱవ పిల్లను చూసి చెప్పిన హాస్యస్ఫూరక చాటువు ఇది.తమిళ స్త్రీలపై శ్రీనాధుడికి ఉన్న చిన్న చూపు ఈ చాటువు వల్ల మనకు తెలుస్తుంది.

అయితంపూడి ఉద్యోగం

ఒక మహానుభావుడు ఉద్యోగం కోసం ఇలా గాలిలో మేడలు కట్టాడూ.ఈ ఉద్యోగం వస్తుందనీ కాదు, వచ్చేదీ కాదు, చెస్తున్నదీ కాదు, చేసిందీ కాదు కాని వస్తుందని ఊహించిన ఉద్యోగం వస్తే మటుకు దరిద్రం తీరుస్తుందన్న కోరికతో విశ్వాసముతో ఇలా ఆలోచించాడు. ఊహించిన ఉద్యోగం వస్తే బోలెడు పాడీపంటా ఏర్పడతాయి. కనీసం ఆరు గేదెల పాడి. అన్ని పాలు పెరుగు దాచడానికి కనీసం నాలుగు కుండలు అవసరం. ఒకటేమో పాలకోసం, ఒకటి పెరుగుకోసం, మూడోది చల్ల కోసం, మరి బంధువులు గట్రా వస్తే ఇవ్వడానికి మజ్జిగ కోసం ఇంకో కుండ.ఇలా ఊహాగానాలు చేసాడు ఆ వ్యక్తి. ఉద్యోగం వచ్చి, ఆరు గేదెల పాడి సమకూరినప్పుడు చేయవలసిన పని గురించి ఇప్పుడే ఆలోచించాడు. కాని ఆ ఊహలలో మజ్జిగ, చల్ల ఒకటే అని అతనికి గుర్తుకురాలేదు. అంటే వస్తుందన్న నమ్మకముతో అలా ఆలోచించాడు అమాయకంగా.ఇలా ఊహలలో జీవించేవాళ్ళు కోకొల్లలు. అసలు అయితంపూడిలో ఉద్యోగం ఉందా లేదా అన్న ప్రశ్నతోగాని, ఉన్నా అది తనకు అందుబాటులో ఉందోలేదొ సరిచూసుకోకుండా ఊహాప్రపంచంలో ఇన్నిన్ని ఆలోచనలు చేశాడు ఆ అభాగ్యుడు. పునాదుల్లేకుండా భవనం కట్టాలని తాపత్రయపడేవాళ్ళనూ, ఆధారం లేకుండా అరిచేతిలో స్వర్గముందని ఊహించేవాళ్ళనూ ప్రస్తావించేటప్పుడు "ఆయన అయితంపూడి ఉద్యోగం చేస్తున్నాడు లెండీ!" అని అంటారు. ఉద్యోగం ఇచ్చినవాళ్ళు, పుచ్చుకున్నవాళ్ళూ లేరూ. కానీ ఉద్యోగం వేరొకటి దొరికిందన్నమాట. ఊహాజీవులు చేసేది అయితంపూడి ఉద్యోగం అన్నమాట.

Wednesday 26 December 2007

శ్రీనాధుని చాటువులు -భోజన ప్రియత్వం

బానెడు జొన్న వంటకము,పంటెడు బాలును, మేటి చారు, యెం
తేనియు బుల్లగూర,కడు దేరిన మజ్జిగ పెద్ద చెంబెడున్
బూనిచి కమ్మ చౌదరులు బొఱ్ఱలు పెంచుక కొండవీటిలొ
గానరు కుంభకర్ణ,గజకర్ణ,హిడింబ, బకాసురాదులన్!!



జొన్నకలి, జొన్నయంబలి
జొన్నన్నము, జొన్నపిసరు, జొన్నలె తప్పన్
సన్నన్నము సున్న సుమీ
పన్నుగ పల్నాటిసీమ ప్రజలందఱకున్


పల్నాటి సీమలో పర్యటించేటప్పుడు శ్రీనాధుడు అక్కడి ప్రజల ఆహారపుటలవాట్ల గురించి వివరించాడీ చాటువులో. సర్వం జొన్నమయం పల్నాటిసీమలో.

జొన్నకలి : జొన్నలు రోట్ళో పోసి కొంచెం నీళ్ళు పోసి దంచిన తర్వాత, వాటిని కడిగిన నీటినీకడుగు " అంటారు. దీన్ని పశువులకు పోస్తారు. ముత్యాలవంటి కడిగిన గింజలను అత్తెసరు పెట్టి వండుతారు. ఆ జొన్నన్నం ఉడికేటప్పుడు వచ్చే అన్నంతో కూడిన గంజిని వేరే పాత్రలోకి వంచి చల్లారిన తర్వాత మరికొంచెం అన్నం, తగుమాత్రం నీరు పోసి, ఉప్పు కలిపి రాత్రంతా ఉట్టి మీదనో , ఎత్తైన చోట ఉంచుతారు. మరునాడు అది పులిసి పుల్లగా అవుతుంది. దీన్నే "జొన్నకలి" అంటారు.

జొన్న అంబలి : జొన్నలు విసిరిన తర్వాత సంగటి చేస్తారు. దానిని నీళ్ళలో కలిపి ఉప్పు వేసి తాగడానికి అనువుగా గరిటజారుగా చేసేదే "అంబలి". దీనినుంచే పల్లెసీమల్లో కాలాన్ని కొలిచే నానుడి వచ్చింది. ఉదయం 8.30 నుండి 9.30 వరకు 'అంబళ్ళ పొద్దు ' అని అంటుంటారు పల్లె ప్రజలు.

జొన్నన్నము : దంచి ,పొట్టు పోయేలా కడిగిన తర్వాత వచ్చే ముత్యాల వంటీ జొన్నలను ఉప్పుతో కలిపి వండగా వచ్చేదే "జొన్నన్నము".

జొన్న పిసరు : జొన్నలు సంగటిగా చేసేటప్పుడు ఒకోసారి ముద్ద కంటే గట్టిగానూ, అంబలి కంటే కొంచం ఎక్కువ గట్టిగానూ అవుతుంది.అదే "జొన్న పిసరు". దాన్ని అలాగే తినడానికి వీలు కాదు. ఈ పిసరుకే కొంచెం నీళ్ళు, ఉప్పు కలిపి రాత్రంతా ఊరబెట్టినట్లయితే 'కలి 'గా మారుతుంది.

పల్నాటి సీమలో నీటివనరులు తక్కువగా ఉన్నాయి. అందుకే వర్షాధార పంట అయిన జొన్నలే పల్నాటి ప్రజలకు ముఖ్య ఆహారము అని శ్రీనాధుడు ఈ పద్యంలో వివరించాడు.

పల్నాటిసీమలోని జొన్నన్నములో ఏదో విషేషముందేమో. అందుకే శ్రీనాధుడు ఆ గరళకంఠుడికి ఇలా సవాలు చేసాడంట.

గరళము మ్రింగితి ననుచున్
బురహర! గర్వింపబోకు, పో పో పో, నీ
బిరుదింక గానవచ్చెడి
మెఱసెడి రేనాటి జొన్న మెతుకులు దినుమీ!

ఇక కంజీవరం వెళ్ళినప్పుడు అక్కడి తమిళుల విందులో శ్రీనాధుడి తిప్పలు అంతా ఇంతా కావు.

తొలుతనే వడ్డింత్రు దొడ్డ మిరియపు జారు
చెవులలొ బొగవెళ్ళి చిమ్మిరేగ
బలు తెరంగుల తోడ బచ్చళ్ళు చవి గొన్న
బ్రహ్మ రంధ్రము దాక బారు నావ
యవిసాకు వేచిన నార్నెల్లు పసి లేదు
పరిమళ మెంచిన బండ్లు సొగచు
వేపాకు నెండించి వేసిన పొళ్ళను
గంచాన గాంచిన గ్రక్కువచ్చు
నఱవ వారింటి విందెల్ల నాగడంబు
చెప్పవత్తురు తమ తీరు సిగ్గు లేక
చూడవలసిన ద్రావిళ్ళ కీడు మేళ్ళు...

అసలే భోజన ప్రియుడైన శ్రీనాధుడు అలవాటు లేని తమిళుల భోజనముతో ఎలాటి అవస్థలు పడ్డాడో కదా. ఆంధ్రుల భోజనములో పప్పు ప్రధానము. తమిళులకు చారు ముఖ్యం. అలవాటు లేని చారు అదీగాక మిరియపు చారు మొదటనే వడ్డించేసరికి కవి సార్వభౌముడికి చిర్రెత్తింది.

బుడతకీచువారు(పోర్చుగీసువారు) మన దేశానికి రాకముందు మనకు మిరపకాయలు లేవు. కారానికి మిరియాలే వాడేవారు. మనకు పోర్చుగీసు వారివల్లనే మిరపకాయలు లభించాయి. మిరియాలకు బదులుగా కారానికి వాడేవి కాబట్టి వీటిని(మిర్యపుకాయలు) మిరపకాయలు అని పిలుస్తారు.


పద్య సేకరణ
డా.కోడూరు ప్రభాకరరెడ్డిగారి శ్రీనాధుని చాటువులు

Tuesday 25 December 2007

క్రిస్మస్ శుభాకాంక్షలు.


ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న ఏసుక్రీస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు

Monday 24 December 2007

మోహం మటుమాయమైతేనే స్థితప్రజ్ఞత

జీవితంలో ఎన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించినా మన మూలాలు మాత్రం భూమ్మీదే ఉండాలి. సాధించే ప్రతీ విజయం అహాన్ని పెంచుతుంటే ఆ అహమే కొన్నాళ్ళకు మనల్ని కబళించివేస్తుంది. ప్రయత్నం మాత్రమేమనం చేయాలి... విజయమొచ్చినా, వైఫల్యమెదురైనా దాని తాలూకు ఆనవాళ్ళు మాత్రం మనల్ని కదిలించకూడదు. దీనినే స్థితప్రజ్ఞత అంటారని భగవద్గీత చదివే ప్రతీ ఒక్కరికి స్పురిస్తుంది. ఆ స్థితప్రజ్ఞత సాధించాలని అందరూ ఆశపడుతుంటారు. కానీ లాభమేముంది.. 'నేను అప్పుడలా చేశాను.. అదే పని నాకు ఇస్తేనా... నాకైతే అదేమీ ఇష్టముండదు ' అంటూ మనం మాట్లాడే ప్రతీ మాటలోనూ "నేను" అనే అహం తొణికిసలాడుతూ ఉంటే... సాధించిన చిన్న విజయాన్నయినా 'అది నేను సాధించాను తెలుసా' అన్నట్లు మనకు ఎదుటివారు ఎంతో గౌరవాన్ని ఇవ్వాలని ఆశించే విధంగా మన ప్రవర్తన ఉన్నంతకాలం స్థితప్రజ్ఞత ఎక్కడినుండి వస్తుంది? ప్రతీ ధర్మాన్నీ, ప్రతీ పనినీ మనం చేయాలి... కానీ ఆయా పనులు మనం చేయబట్టే సక్రమంగా పూర్తయ్యాయని,,ఇంకొకరైతే వైఫల్యం చెందేవారని స్వోత్కర్ష చేయడం మనం వ్యక్తిత్వం కోల్పోయేలా చేస్తుంది. మనం సాధించిన విజయాలు సమాజం గుర్తించాలన్న తాపత్రయంతో ఎంత గొంతెత్తుకుని చెప్పుకున్నా... మొహమాటానికి మాత్రమే సమాజం, మన గొప్పలను విన్నట్టు నటిస్తుందనీ తెలుసుకునేసరికి గొంతు మూగబోతుంది. అందుకే విజ్ఞత కలిగిన వారెప్పుడూ తమ గురించి తాము ఎక్కువగా మాట్లాడరు. మన గురించి మనం ఎంత ఎక్కువగా మాట్లాడతామో .. అంతగా మనపై మోహం, అహం పెరుగుతుంది. మన మాటలను ఎదుటివారు తప్పక వినాలి, తప్పక ఆమోదించాలి అన్నంత తారాస్థాయికి అది చేరుతుంది. మన మాటలను వినేవారు ఎవరూ లేకపోతే మనం బ్రతకలేమన్నంత అధోఃస్థితికి దిగజారడం జరుగుతుంది. అందుకే... మన ఆలోచనా విధానంలోనే మనం చేసే ప్రతీ పని, ఫలితం మనకు చెందినది కాదు అన్నట్లుగా మార్పిడి చేసుకుంటూ పోతే వాటి గురించి ఎవరికీ గోడు వెల్లబోసుకోవాలన్న ఆలోచన కలగదు. ఫలితపు భారం లేనప్పుడు స్థితప్రజ్ఞత దానికదే వస్తుంది.

నల్లమోతు శ్రీధర్

శ్రీకృష్ణదేవరాయలవారికి జయహో!!!



మన ఆస్థాన వైద్యశిఖామణి డాక్టర్.ఇస్మైల్ గారికి మనఃపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

Sunday 23 December 2007

అమూల్యమైన బహుమతులు


పుట్టినరోజు సంధర్భంగా అభినందనలు తెలిపిన వారందరికి నా హృదయపూర్వక ధన్యవాదములు(నెనర్లు-నాకు నచ్చలా). ఇక నాకు వచ్చిన బహుమతులు గురించి చెప్పొద్దా మరి. బ్లాగులో వచ్చిన బహుమతులు అందరికీ తెలిసినవే. నా గుంపు హైదరాబాద్ మస్తీలో మాత్రం మరిచిపోలేని, విలువకట్టలేని బహుమతి లభించింది. నా పుట్టినరోజును స్పెషల్ చెయ్యడానికి , అందరు కలిసి వారం ముందునుండే ప్రయత్నాలు మొదలెట్టారు, నేను గుర్తుపట్టకుండా, కనీసం ఊహించడానికి కూడా వీలు లేకుండా. ఆ గుంపులో అందరూ స్నేహితులు, కుటుంబ సభ్యులలాగా ఉంటారు. ఎప్పుడన్నా ఎవరైనా పోట్లాడితే నేను సర్ది చెప్పేదాన్ని. చెత్త మేసేజీలు పంపితే గెంటేయడమే. ఎంత ప్రేమగా ఉంటానో అంత కఠినంగా కూడా ఉండేదాన్ని. వారం ముందు ఓ పదిమంది కలిసి పథకం అమలు చేయడం ప్రారంభించారు. ఏదో ఒక చిన్న విషయం పట్టుకుని పోట్లాట మొదలెట్టారు. అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి చాలా తీవ్రంగా, పరుషంగా మాట్లాడుకుని, నేను వెళ్ళిపోతాను , నేను వెళ్ళిపోతాను అని అనడం మొదలెట్టారు. ఇదేంటి ఎప్పుడు లేనిది అందరు ఇలా పోట్లాడుకుంటున్నారని నేను సర్ది చెప్ప సాగాను. నాకేం తెలుసు వాళ్ళందరు కావాలని చేస్తున్నారని.మరో ప్రక్క అందరు నా గురించి తమ తమ అభిప్రాయాలన్ని సేకరించి, ఒక స్లైడ్ షోగా తయారు చేసారు. నిన్న మద్యాహ్నం వరకు గుంపులో నాకు శుభాకాంక్షలు ఎవరూ చెప్పట్లేదు. నాతో పాటు ఇంకో వ్యక్తి పుట్టినరోజు కూడా జరుపుకున్నాడు. నేను అతనికి విషెస్ చెప్పాను. అందరు అతనికే చెప్పసాగారు. నేననుకున్నా వీళ్ళందరు కలిసి నాకు ఎదో Surprise ఇవ్వబోతున్నారని.

సరిగ్గా మధ్యాహ్నం పన్నెండింటికి మొదలెట్టారు.జరిగిన విషయం చెప్పి ఈ స్లైడ్ షో ఇచ్చారు. నిజంగా షాక్ అయ్యా. ఇంత పకడ్బందీగా చేసారు ఈ పిల్లలందరూ అని.నన్ను అలా ఫూల్ చేసారని కోపం ఓ పక్క, కాని నా పుట్టినరోజు కోసం వారం ముందునుంది అందరు కలిసి ఇంత కష్టపడ్డారు, ఎంత ప్రేమగా స్లైడ్ షో చేసారు అని. ఇంతకంటే విలువైనది ఏదైనా ఉంటుందా.వాళ్ళ పోట్లాట thread 300 దాటింది రెండు రోజులలో. అంత వాడిగా వేడిగా జరిగిందన్నమాట. ఈ షాక్ నుండి తేరుకునే లోపు ఒక అబ్బాయి సాయంత్రం వీడియో శుభాకాంక్షలు చేసి పంపాడు. అది చూసి కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఇంత మంది ప్రేమకు నేను పాత్రురాలినైనందుకు ఎంత అదృష్టవంతురాలిని అని. ఇక మన కూడలి కబుర్లలో మిత్రులు ఊరుకుంటారా. మంచి పద్యం వినిపించారు (పాడారు).

ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు
దిద్దరాని మహిమల దేవకీ సుతుడు
అంత నింత గొల్లెతల అరచేతి మాణికము
పంతమాడే కంసునీ పాలి వజ్రమూ
కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ బూస
చెంతన మాలోనున్న చిన్ని కృష్ణుడూ
ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు
రతికేళి రుక్మిణికి రంగుమోవి పగడమూ
మితి గోవర్ధనపు గోమేధికము
సతమై శంఖ చక్రాల సందున వైఢూర్యము
గతియై మమ్ము కాచేటి కమలాక్షుడు
ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు
కాళీంగుని తలపై గప్పిన పుష్యరాగము
ఏలేటి శ్రీ వేంకటాద్రి ఇంద్ర నీలము
పాల జలనిధి లోన బాయని దివ్య రత్నము
బాలునీ వలె దిరిగే పద్మనాభుడూ..........


చావాకిరణ్ ,కొత్తపాళి, నాగరాజు గారు కలిసి కూర్చిన ఈ పద్యహారంలోని నవరత్నాలను గమనించండి.ఇంతకు మించి విలువైనది ఇంకేదైనా ఉన్నదా???


నేను ఇదంతా చెప్పింది , అందరు నన్ను మెచ్చుకుంటున్నారని కాదు, యాంత్రికంగా మారిన మన జీవన వాహిణిలో అప్పుడప్పుడు ఇలా ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్తే ఎదుటివారి మోముపై చిన్ని చిరునవ్వు తెప్పించగలము కదా అని. అందుకే నేను నా బ్లాగులో నాకు తెలిసినవారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేది. ఇలా మిత్రులు, సన్నిహితుల నుండి అందుకున్న శుభాకాంక్షలు విలువకట్టలేనివి, మరిచిపోలేనివి .మధురమైనవి అయి ఉంటాయి. మీరూ ప్రయత్నించండి..

Saturday 22 December 2007

పుట్టినరోజు పండగే అందరికి






ఇవాళ నా పుట్టినరోజు. ఈ సంవత్సరమంతా ఎన్నో విజయాలు సొంతం చేసుకున్నాను. నా పుట్టినరోజు జరుపుకోవడం అలవాటులేకున్నా, ఈ సంతోషకరమైన సందర్భంలో మీ అందరి ఆశీర్వాదాలతో నా బ్లాగులో పండగ చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. కాని నాకు ఉత్తుత్తి శుభాకాంక్షలు వద్దు. శుభాకాంక్షలతో పాటు బహుమతి కూడా కావాలి .. ఒకసారి నా బ్లాగులోనే రవి వైజాసత్య చెప్పాడుగా అడగనిదే అమ్మైనా పెట్టదు అని,అందుకే అడుగుతున్నా.

శుభాకాంక్షలతో పాటు ఒక మధురమైన ఆణిముత్యంలాటి పాట ఇవ్వాలి (కనీసం రెండు లైన్లైనా).తెలుగైనా, హిందీ ఐనా ఓకే.

Friday 21 December 2007

Meeting on RTI

Hello Friends,

Please attend the session on RTI Act.

Topic: Introduction to RTI Act, Details, Procedures, Examples, Farmer Issues, the govt. data vs facts.

Speaker: Rakesh

Timings: 10 am to 12:30 pm

Venue: KMRR Center, above Srinagar Colony Post Office, Near Chanti Mess, opp. Big Byte Bakery Lane. Those who come from Punjagutta side, it is the next lane to Andhrabank ATM.

Phone Number: 040-23747607.

Venue is fit for 40 to 50 members. Those who already know about RTI, no compulsion. Those who do not know, do not miss. Pass the news with your friends and colleagues.

--
Thank you.

with regards,
PRASANTHI.

Monday 17 December 2007

నా షడ్రుచుల ప్రయాణం.

రెండురోజుల నుండి ఆలోచించగా.. చించగా...ఎన్నెన్నో జ్ఞాపకాలు..ఎందుకో ఒక్కసారి నా వంటలు, షడ్రుచుల ప్రయాణం నెమరువేసుకున్నాను. చిన్నప్పుడూ చాలా గారంగా పెరిగాను ఒక్కతే కూతురిగా. అమ్మే అన్ని పనులు చేసుకునేది. ఏడు, ఎనిమిది తరగతిలో ఉన్నప్పుడూ మొదటిసారిగా వంటింట్లోకెళ్ళి స్వంతంగా టీ చేసుకునేదాన్ని పొద్దునే చదుకోడానికి లేచినప్పుడూ.ఇల్లు సర్దడం లాంటి చిన్న చిన్న పనుల్లో సాయం చేయడమే నా పని. ఆమ్‌లెట్ వేయడం తప్పితే ఎక్కువగా వంటగదిలో కాలు పెట్టిందిలేదు. పెళ్ళయ్యేవరకు కూడ, ఇంట్ళో ఎన్ని పార్టీలున్నా సరే. మా అమ్మ తిట్టేది , రేపు పెళ్ళయ్యాకా మీ అత్తగారు నన్ను తిడతారు - కూతురికి వంట, ఇంటిపనులు నేర్పించలేదు అని. నేననేదాన్ని పెళ్ళయ్యాక ఎలాగూ తప్పదు, అప్పుడు నేర్చుకుంటాలే, అంతగా ఐతే మా అమ్మ నేర్పించినా నేనే నేర్చుకోలేదు అని చెప్తాను అనేదాన్ని. మా నాన్న కూడా నాకే సపోర్ట్. కాని అప్పుడప్పుడు వడ్డన మాత్రం చేసేదాన్ని.కాలేజీ, ఇల్లు తప్ప వేరే లోకం లేదు.



ఇక నా అసలు ప్రహసనం మొదలైంది అత్తారింట్లో. ఉమ్మడి కుటుంబం. పెళ్ళయ్యాక మా తోటికోడలికి వంట చేయడంలో సాయం చేసేదాన్ని. కూరగాయలు కోయడం, బియ్యం కడగడం లాంటివి కాని అస్సలు అన్నం మెత్తగా కాని బిరుసుగా కాని ఉండకుండా సరిగా వండడం అసలు తెలీదు.సగం ఉడికాక ఎదో పనిలో సీరియస్సుగా ఉండేదాన్ని అప్పుడూ ఆవిడే చూసి దింపేవారు.మెల్లిగా అడిగేదాన్ని అన్నం పూర్తిగా ఉడికిందని ఎలా తెలుస్తుందని. ఆవిడ చెప్పేవారు.(మనసులో ఏమనుకున్నారో మరి). నాకు ఇంకా గుర్తుంది .పెళ్ళయ్యాక వారానికి మా తోటికోడలు తన స్నేహితురాలు వచ్చిందని నన్ను ఉప్మా చేయమన్నారు. అంతే. నా మైండ్ బ్లాక్ ఐపోయింది. రాదు అని చెప్పా. అప్పుడు ఆవిడ నిజంగా రాదా. మీ అమ్మా వాళ్ళింట్లో ఎప్పుడు ఉప్మా చేయలేదా అన్నారు.కాని మా అమ్మ చేస్తే తినడమే తెలుసు , చేయడం రాదని భయపడుతూనే చెప్పేసా తప్పదుగా మరి. అప్పుడూ రవ్వ బాగు చేసిచ్చి (నాకు అది కూదా రాదు మరి) అన్ని కోసి ఇస్తే నాకు చూపిస్తు చేసారావిడ. కొద్ది నెలలకే వేరు కాపురం. చచ్చినట్టు నేనే వండాలి. ఇక తప్పదన్నట్లు మా అమ్మ దగ్గరున్న వంటల పుస్తకాలన్నీ తెచ్చేసుకున్నా, అసలు పప్పు ఎలా చేయాలి, చారు , కూరలు బేసిక్‌గా ఎలా చేయాలి అని అడిగి మనసులో గుర్తుపెట్టుకున్నాను. గ్లాసుడు పప్పుకు నాలుగు పచ్చిమిరపకాయలు, సగం ఉల్లిపాయ,కొద్దిగ కరివేపాకు, కొత్తిమిర, ఒక స్పూను కారం పొడి, ఒక పెద్ద స్పూనుడు ఉప్పు, పసుపు,నాలుగంటే నాలుగే టమాటాలు, (ఎప్పుడన్నా కావాలనుకుంటే వేరే కూరగాయలు వేసుకోవచ్చు) అని అమ్మ దగ్గర తెలుసుకున్నా. కనీసం ఇవన్నా రావాలిగా. రోజు అలాగే ఇదే కొలతలతో వంట చేసేదాన్ని. ఏంటో బానే ఉండేది పప్పు. మా వారు పెళ్ళికి ముందు వంట చేసుకోవడం అలవాటైనా వంటింట్లోకి వచ్చేవారు కాదు. ఎప్పుడైనా సలహాలు మాత్రం ఇచ్చేవారు. ఇక అప్పుడప్పుడు ఇంటికి వచ్చిన చుట్టాలతొ మెల్లి మెల్లిగా నేర్చుకోవడమ్మొదలుపెట్టా. కాని పూర్తి ఇష్టం, శ్రద్ధతో నేర్చుకోలేదు.

ఒక్కసారి మాత్రం గొడవైపోయింది.. పొద్దున పొయ్యిమీద ఒక వైపు కుక్కర్లో దోసకాయ పప్పు చేస్తూ అందులో అన్ని కోసి వేస్తున్నాను.మరోపక్క మా వారికి టీ చేస్తున్నా. కొత్త కొత్త వంటల ప్రయోగం కదా.టీలో వేసే టీపొడి చటుక్కున పప్పులో వేసా.ఇంకా నయం కారం తెచ్చి టీలో వేయలేదు. కాని అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. అరగంటలో మావారు ఆఫీసుకెళ్ళాలి. ముందు టీ ఇచ్చేసి, మా పై పోర్షన్‌లో ఉంటున్న మా అమ్మ దగ్గరికెళ్ళి జరిగిన సంగతి చెప్పి చిన్న గిన్నెడు పప్పు తెచ్చి మా వారికి పెట్టెసా. తర్వాత మళ్ళీ పప్పు వండాననుకోండి. కాని టీపొడి పడిన పప్పు పనిమనిషి కూడ తినలేదే..ఏం చేయను. పడేసా.తర్వాత రాత్రికి మావారికి చెప్తే , ఏం చేస్తాం నా ప్రాప్తం.నా అదృష్టం అన్నారు. అప్పటినుండీ కాస్త జాగ్రత్తగానే ఉంటాను. వంట చేయడం రాకున్నా , వడ్డనలో మాత్రం పర్‌ఫెక్ట్. ఎవరింటికి వెళ్ళినా నన్ను వంటలు, వడ్డన అప్పజెప్పేవారు. ఎందుకంటే నేను తినేవారి మొహం చూడకుండా అందరికీ సమానంగా వడ్డించేదాన్ని వేగంగా. (చాలామంది ఏం చేస్తారంటే తినేవాళ్ళ మొహం చూసి వడ్డిస్తారు. వేసుకో, వేసుకో అంటారేగాని గిన్నెలోనుండి గరిటే బయటకు రాదు) పెళ్ళైన పదేళ్ళవరకు చపాతీలు చేయడం రాక అస్సలు చేసేదాన్ని కాదు. పూరీలు, పుల్కాలు మాత్రమే. చపాతీలు చేస్తే అవి ఒక్కోటి ఒక్కో దేశం నమూనా తయారయ్యేది. మెత్తగ ఉండేది కాదు. ఎందుకొచ్చిన తంటా అని చేయడమే మానేసా.కాని వంటలన్ని సరిగ్గా చేయడం నేర్చుకోడానికిన్ నాకు నా మీద నమ్మకం కుదరడానికి పదేళ్ళు పట్టింది. ఒక్కదాన్నే కదా. స్వంతంగా నేర్చుకోవాలి మరి.50 మందికి ఒక్కదాన్నే చేయగలను అనే ధీమా వచ్చింది చేసాను కూడా.. ఎప్పుడు కూడా నవళ్ళు, వంటల పుస్తకాలే కొనడం. చదవడం ఎక్కువ, చేయడం తక్కువ. ఆ మసాలాలన్ని చేయడానికి బద్ధకం.సింపుల్‌గా తక్కువ వస్తువులతో చేయడానికి ప్రయత్నించేదాన్ని.


అలా అలా సాగిన నా వంటల ప్రయాణం షడ్రుచులు బ్లాగు మొదలెట్టడానికి కారణమైంది. కాని నాకు అర్ధం కానిదొక్కటే నేను రోజు ఇంట్లో చేసుకునే వంటకానికే ప్రముఖ దినపత్రికలో బహుమతి రావడమేమిటీ. మళ్ళీ ఇంకో దినపత్రికలో మరో వంటకం ప్రచురింపబడటమేమిటీ అని నమ్మలేకుండా ఉన్నాను. నిన్నటి అంటే ఆదివారం 16 డిసెంబర్ Times of India పేపర్లోని hyderabad timesలో ఆంధ్రా కిచెన్‌లో వచ్చింది. ఎలా ఉందో ఆ వంటకం కాస్త చూడండి.

Friday 14 December 2007

బంధాలు ముఖ్యం

ఎవరూ మనతో కలవడం లేదని బాధపడుతుంటాం.. మనం మాత్రం ఎవరినీ కలుపుకుపోం!
ప్రేమ కురిపించే ఆత్మీయులు ఎవరూ లేరని కుంగిపోతుంటాం.. మన ప్రేమకై
అర్రులు చాచే వ్యక్తులు అనేకమంది ఉన్నా వారి ఉనికే పట్టించుకోం!
ఆత్మీయులు డబ్బుకిచ్చిన విలువ మనకివ్వడం లేదని వాపోతుంటాం.. మనం మాత్రం
"చూశారా.. ఆ సందర్భంలో అది పెట్టలేదు,ఇది పెట్టలేదు" అని నసుగుతుంటాం!
గడ్డు పరిస్థితుల్లో మానసికంగా ధైర్యం ఇవ్వకపోగా లోకువ చేశారని
ద్వేషాన్ని పెంచుకుంటాం.. ఎదుటివారు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం వారి
కష్టాలను ఆసరాగా చేసుకుని మనమూ మాటల తూటాలు వదిలి బాధపెడుతుంటాం.
పరిస్ఠితుల్ని కేవలం మన కోణం నుండి మాత్రమే చూడడం వల్లది తలెత్తే
అనర్థాలు ఇవి. మరో విధంగా చెప్పాలంటే మనలోని స్వార్థం మన గురించి
మాత్రమే
ఆలోచించేలా చేస్త్లోంది తప్ప ఇతరుల అంతరంగాల్లోని కష్టాలను, బాధలను,
భావోద్వేగాలను అంచనా వేయడానికి మనస్కరించదు. నేను చేసే ప్రతీ పనీ
కరెక్టే.. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎదుటి వారిదే తప్పు అనుకోవడం
అవివేకం! ఏ ప్రాపంచిక బంధాల పునాదులు గట్టిగా ఉండాలన్నా.. "నేను
కరెక్టే.. ఎదుటి వ్యక్తీ కరెక్టే.. ఎక్కడో సమస్య ఏర్పడింది.. దానిని
వెదికి పట్టుకుని పరిష్కరించుకుందాం" అనే ధోరణి అలవర్చుకోవాలి.
అన్నింటికన్నా ముఖ్యంగా నిత్యజీవితంలో చోటుచేసుకునే చిన్నచిన్న
అభిప్రాయబేధాలను, పొరపొచ్ఛాలను మనసులో పాతుకుపోయేలా చేసుకుని, చిలవలు
పలవలుగా ఊహించుకుని ఎదుటి వ్యక్తులపై ద్వేషాన్ని పెంచుకోవడం మనం చేసే
పెద్ద తప్పు! ఇద్దరి మధ్య సమస్య వచ్చినప్పుడు వారిద్దరూ బాధపడుతుంటే..
ప్రక్కవారు బాధ నటిస్తూ మనసులో మాత్రం ఆనందపడుతుంటారు. కొంతమందైతే
మరికొంత ముందుకువెళ్లి లేనివీపోనివీ మరిన్ని కారణాలను చూపించి ఆ ఇద్దరి
మధ్య 'వీలైనంత దూరం' పెరిగేటట్లు శాయశక్తులా క్రుషిచేస్తారు. దీనితో
అసలు
సమస్య పెట్టే బాధ కన్నా చాడీల బాధ మనల్ని కలచివేస్తుంది. ఇలాంటి
పరిస్థితుల్ని మన మానసిక లోపంతో మనమే కొనితెచ్చుకుంటుంటాం. ఎవరితో సమస్య
ఆ ఇద్దరు పరిష్కరించుకోవాలే తప్ప ఇతరుల జోక్యం, ప్రమేయాన్ని మనం
అనుమతించకూడదు. అప్పుడు బంధాలు, బంధుత్వాలు గట్టిగా ఉంటాయి.

- నల్లమోతు శ్రీధర్

Wednesday 12 December 2007

అయోమయం


ఏంటో అంతా తికమకగా ఉంది..

ఇదివరకే అదిస్తాం ఇదిస్తాం అని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఉద్ధరించిందేమీ లేదు... ఇప్పుడు చిరు వస్తాడంటారు. అనవసరంగా ఆయన సినిమాలు వదిలి ఈ కంపు రాజకీయాలలోకి రావడం అంత అవసరమా. రాష్ట్రాన్ని ఆయన ఒక్కడే ఉద్దరించగలడా? కనీసం కొంచమైనా మార్చగలడా? ఇప్పటికి ఎన్ని పార్టీలు ఆయనను ఆహ్వానించాయి. ఆయనేమో ఎటూ తేల్చక నానుస్తున్నారు. ఇప్పటిదాకా పేరుకున్న కుళ్ళును ఆయన సినిమాలలో రౌడీలను కొట్టినంత ఈజీగా కడిగేయగలడా?? అది మనం కలలో ఐనా ఊహించగలమా. ఆయన పేరు చెప్పుకుని అధికారంలోకి రావాలని వెర్రి ప్రయత్నం చేస్తున్నారు.జనాలు తెలుసుకోలేని దద్దమ్మలనీ వాళ్ళకు తెలుసుగా.. చంద్రబాబేమో తాజాగా నేను మారిపోయానోచ్ అంటాడు. కె.సి.ఆర్ అంటాడు చిరు తన పార్టీలోకి వస్తే లాభపడతాడని. అంత బచ్చాగాడా చిరంజీవి అంటే. అందరికీ తెలుసు వాళ్ళిద్దరిలో ఎవరిని ఎక్కువ జనాలు గుర్తుపడతారో? ఈ కుళ్ళిపోయిన రాజకీయాలు చూసి చూసి, కొత్తగా లోక్ సత్తా పార్టీ నేత జయప్రకాష్ చెప్పే నీతి బోధలు అస్సలు నమ్మబుద్ధికావట్లేదు. ఒకవేళ అధికారమిచ్చినా ఆ తర్వాత మన దౌర్భాగ్యం ఇలాగే ఉండదని నమ్మకమేమిటి? ఇదేమన్నా టాగూర్ సినిమానా. అంత ఈజీగా జనం మారిపోవడానికి..

ఇప్పుడు నేను ఎన్నికలలో ఓటు వేయాలా? లేక అది దుర్వినియోగం కాకుండా వెళ్ళి దాన్ని పనికిరాకుండా చేయనా?? ఇదే ఆలోచన చాన్నాళ్ళుగా నా బుర్రను తొలిచేస్తుంది??

వాట్ టూ డూ???

Tuesday 11 December 2007

e-తెలుగు సమావేశ చిత్రాలు













Monday 10 December 2007

అంబాజీపేట ఆముదం

మనం ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక జాతీయం వింటుంటాం. కాని చాలా వాటికి సమాధానం తెలీదు. అందుకే నాకు కలిగిన ఎన్నో సందేహాలు దా.బూదరాజు రాధాకృష్ణగారి పుస్తకం చదివి తీరిపోయాయి. నాలాటి వారు ఇంకొందరు ఉండొచ్చు అని కొన్ని ఇక్కడ వివరిస్తున్నాను. రచయితకు ధన్యవాదములతో...



తెలుగుదేశంలోని ఆముదం పంటల్లో అంబాజీపేటలో పెరిగిన మొక్కలు సర్వశ్రేష్ట్రం అంటారు. దొంగతనానికి బయలుదేరినవాళ్ళు ఒంటికి ఆముదం పట్టించుకుని వెళ్ళేవారు పట్టుకున్నా పట్టుజారి తప్పించుకోవడానికి.అందుకే ఎవరికీ దొరకని, ఏవిధంగానూ చిక్కని వ్యక్తి శ్రేష్టమైన అంబాజీపేట ఆముదం పూసుకున్నాడనటం వింటుంటాము.కొందరు వ్యక్తులు తమ పనులు నెరవేరేదాకా వెంటపడి వేధిస్తారు జిడ్డులాగా పట్టుకుని, తిట్టినా, కొట్టినా అస్సలు వదలరు.అలాటి వ్యక్తులను కూడా "అంబాజీపేట ఆముదం" లా జిడ్డులా పట్టుకున్నాడని తిట్టుకుంటాము.

Meeting on 9 th December

Hello Friends,

Greetings.

We all met on Sep 9th and exactly after 3 months we are organizing one
more meeting.

While the Sep 9th meeting is for all groups that we know, this is
clearly for active volunteers who can and are willing to spare two
days per month for social work. Also for the groups and individuals
who do not have a clearly marked agenda or area of interest.

As we gain some experience, we are now determined to conduct meeting
very formally and also will be time bound.

Uniqueness:

1. Will be a day long meeting
2. People can participate virtually too
(Interested members are requested to login in yahoo/google messengers)

దీపాలార్పేద్దామా????


There is a story from Mumbai about Batti Bandh.

Batti Bandh is an entirely voluntary event taking place on the 15th of
December between 7:30 & 8:30 p.m. This event is aimed at requesting
all of Mumbai to stand up for a cause that is greater than all of us.
All you need to do is switch off lights and appliances in your home,
shop, office, school, college or anywhere you are for 1 hour to take a
stand against global warming. Just 1 hour.

http://www.mumbaiunplug.com/

Shall we do the same in Hyderabad?

Thank you.

with regards,
Prasanthi.

Saturday 8 December 2007

అన్నీ ఉన్న బిక్షగాళ్ళగా బ్రతక్కండి!

మనలో చాలామంది ’తీసుకోవటానికే’ అలవాటు పడిపోతారు.ఎదుటివ్యక్తి కురిపించే ప్రేమను తీసుకుంటారు.ఇతరులు అందించే ధన, వస్తు,సేవా సహాయాన్ని తీసుకుంటారు.ఇతరుల నుండి విజ్ఞానాన్ని గ్రహిస్తుంటారు.అయితే తీసుకోవడంలో కనిపించే ఆత్రుత ఇతరులకు ఇవ్వడంలో కనిపించదు.కోట్లాది రూపాయలు కూడబెట్టాలని పరుగులు తీస్తుంటారు.పోతూ పోతూ పాడెతో పాటు ఆ కోట్లని మూట గట్టుకుపోలేమన్న కనీసజ్ఞానం కూడా మనసుకు తట్టదు.సంపదగానీ, జ్ఞానంగానీ పంచుకుంటూ పోతేనేపెరుగుతుంటుంది.ఈ సృష్టిలో ఒక ప్రాధమిక నియమం ఉంది.ఏది ఇవ్వనిదే ఏది పొందలేము.ఉ.దా. మనము కొత్తబట్టలు ధరించాలంటే పాతబట్టలు పక్కనపెట్టాల్సిందే. కడుపునిండా తినాలంటే మలమూత్రాలు విసర్జించాల్సిందే. అలాగే డబ్బు,నాలెడ్జి కూడా! నాకు తెలిసిందే గొప్ప అని విర్రవీగుతూ ఇతరులకు తానోపెద్ద విజ్ఞానిగా ఫోజులు కొట్టేవారు కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఉత్సాహాన్ని స్వతహాగాపోగొట్టుకుంటారు.కారణం... అన్నీ తమకు తెలుసునన్న అహంకారమే.. వారిని కొత్త విషయాలు తెలుసుకోకుండా అడ్డుకుంటుంది. అంటే వారు తమకు తెలిసింది ఇతరులతో పంచు కోలేకపోతున్నారు.ఇతరుల నాలెడ్జిని పొందలేకపోతున్నారు. చివరకు ఏమవుతుంది.అపారమైన జ్ఞానసంపదలో అణువంతైననూ పొందకుండా బావిలో కప్పలా మిగిలిపోవడం తప్ప.ఇవ్వడంలో ఎంత తృప్తి ఉంటుందో ఎప్పుడైనా గమనించారా?నాకు తెలిసిన నాలెడ్జ్‌ని పత్రిక ద్వారా నా పాఠకులతో పంచుకునేటప్పుడు నేను పొందే తృప్తిని కోటీష్వరులు కూడా పొందలేరు.నాకు తెలిసి నా బెస్ట్ నా ప్రియ పాఠకులకు అందిస్తున్నానన్న సంతృప్తికి మించి ఏమికావాలి! ఎవరికి వారు తమ తమ రంగాలలో, తాము చేసే వృత్తి ఉద్యోగాలలో, సామాజిక బంధాలలో ఎదుటి వ్యక్తికి ఇవ్వగలిగినంత సేవ,ఆనందం, చేయూత ఇవ్వగలిగితే ప్రపంచం ఆదర్శవంతం కాక మరేమవుతుంది.మీరు ఏమీ చేయనవసరంలేదు. కష్టాల్లో ఉన్నవారికి నాలుగు ధైర్య వచనాలు చెప్పండి. కుటుంబ సభ్యులతో కొట్లాటలకు బదులు సున్నితంగా వ్యవహరించండి. ఆర్ధికంగా సాయం కోరినవారికి మీకు తోచినంత..తిరిగి ఇస్తాడో లేదో అన్న సందేహం మాని సాయం చేయండి.తోటి వ్యక్తిని చూసి ఒక చిరునవ్వు నవ్వండి.ట్రాఫిక్ జామ్ అయితే మీవరకు మీరు అడ్డదారులు తొక్కకుండా బాధ్యతాయుతంగా డ్రైవ్ చేయండి.తోటి వ్యక్తిని చూసి చిరునవ్వు నవ్వండి.ఇలాంటి చిన్న చిన్న చర్యలే మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తాయి.అంతే తప్ప.. నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బులు ఇతరులకు ఎందుకివ్వాలి. నేనే ఎందుకు నవ్వాలి, వాడు ఎందుకు నవ్వవచ్చు కదా! నా నాలెడ్జ్ ఇతరులకు ఎందుకు చెప్పాలి అనుకుంటూ సణుక్కుంటూ కూర్చున్నామంటే మనం అన్నీ ఉండి జీవితాంతం "నేనేమీ ఇవ్వను,మీరే నాకు ఇవ్వండి" అంటూ బిక్షమెత్తుకునే బిక్షగాళ్ళమే అవుతాం.మీరూ బిక్షగాళ్ళగానే బాగుందంటే ఒకే. నో ప్రాబ్లం...

మీ నల్లమోతు శ్రీధర్.

జాగ్తే రహో!!! పారాహుషార్ !!




వేళ కాని వేళలో ఈ మేలుకొలుపులు ఏంటనా?? ఈ మధ్య మన బ్లాగర్లు
చాలా సుస్తీగా, బద్ధకంగా ఉన్నట్టున్నారు. చివరి నెల అని పనుల్లో బిజీనా,
లేక నడి శీతాకాలంలో చలికి ముడుచుకుని బద్ధకిస్తున్నారా. బ్లాగులు రాసేది
తక్కువ. వ్యాఖ్యలు మరీ తగ్గిపోయాయి. అందరు బ్లాగు టపా చదివి వెళ్ళి
పోతున్నారు. మరి కాస్త ఓపిక తెచ్చుకుని ఆ టపా బావుందో లేదో చెప్పండి.
ఇలా వ్యాఖ్యలకు ఎదురుచూడకపోయినా, తప్పులు అనేవి కాని, సర్దుబాట్లు
అనేవి ఉంటే చేసుకోవచ్చు అని ఆ రచయితలు ఎదురుచూస్తుంటారు. ఎన్ని
ఆశలతో రాసి ఉంటారు ఆలోచించండి. కొత్త బ్లాగర్లైతే రెస్పాన్స్ లేదని మళ్ళీ
రాయడానికి ఉత్సాహం చూపించరుగా..

Tuesday 4 December 2007

స్వర నీరాజనం


మధుర గాయకుడు స్వర్గీయ ఘంటసాల 85వ జయంతి సందర్భంగా
స్వర నీరాజనం.. చూడండి.. వినండి... మనసారా ఆనందించండి.


శివశంకరి శివానందలహరి...


చందురుని మించు అందమొలికించు....


నన్ను దోచుకుందువటే వన్నెలదొరసాని...


ఊహలు గుసగుసలాడే....


ప్రతీరాత్రి వసంతరాత్రి ప్రతిగాలి పైరగాలి....


నా హృదయంలో నిదురించే చెలి.....


ధనమేరా అన్నిటికి మూలం...


మల్లుయలారా.. మాలికలారా....


ఏడతానున్నాడో బావ....


కారులో షికారుకెళ్ళే ...


ఆడుతు పాడుతు పనిచేస్తుంటే...


నమో భూతనాధ....

ఏమిటీ ఘోరం????



పేదల చిన్నారుల ఆసుపత్రి నీలోఫర్ ఇప్పుడా చిన్నారుల మరణవేదికైంది. రాష్ట్ర నలుమూలలనుండి వైద్యానికి, ప్రసవానికి వచ్చే ఎందరో తల్లుల కడుపుకోతకు కారణమైన రభస ఒక ఎం.ఎల్.ఏ.డాక్టర్ల మధ్య జరిగింది. అసలు ఇక్కడ తప్పంతా డాక్టర్లదే. తప్పు చేసిన నాయకుడిని వదిలేసి వైద్యాన్ని వదిలేయడమేంటి. ఇదేనా వాళ్ళు నేర్చుకున్న చదువు సార్ధకత.అంతగా కోపమైతే ఆ నాయకుడిని పట్టుకుని కొట్టండి కాని చావుబ్రతుకులమధ్య ఉన్న పసిపిల్లలను బలిపెట్టడమేంటి. ప్రాణాలు పోయడం వాళ్ళ కర్తవ్యమా, లేక తమ గొడవకు నెలల పిల్లల ప్రాణాలు తీయడమా. నవమాసాలు మోసి కని ఎన్నో ఆశలతో తమ బిడ్డలను ఇక్కడికి తీసుకొస్తే వైద్యం లేక తమ కళ్ళముందే ఆ పసిమొగ్గలు వసివాడిపోతే ఆ తల్లితండ్రుల కడుపుకోత ఎవరు తీర్చగలరు. ఈ గొడవ రెండు మూడు రోజుల్లో సర్దుకుంటుంది. కాని ఆ పసిప్రాణాలు మళ్ళీ తీసుకురాగలరా. దేవుడే డాక్టర్ల రూపంలో తమ పిల్లలను కాపాడతాడని ఇక్కడికి తీసుకువచ్చిన ఆ కుటుంబ సభ్యులు ఏం నేరం చేసారని. వాళ్ళకింత అన్యాయం చేస్తున్నారు.


ఇంత పంతమా ఆ డాక్టర్లకి.ఈ రాజకీయ నాయకుల సంగతి తెలిసిందే .. కర్ర విరగదు పాము చావదు అన్నట్టు నానుస్తున్నారు పైగా ఆ పిల్లలను చావు బ్రతుకుల మధ్య తీసుకొచ్చారు, వైద్యం లేక చావలేదు అంటున్నారు. తమ సమస్యలకోసం రోడ్డుకెక్కిన డాక్టర్లకు కనీస మానవత్వం లేదా పైగా ఏ పాపము తెలియని చిన్నారులు బలవుతున్నా పంతం పట్టుకుని ఉన్నారు.ఇప్పటికే రెండు రోజుల్లో పదిమంది చిన్నారులు బలయ్యారు. పైగా రాష్ట్రవ్యాప్తంగా సీనియర్ డాక్టర్లు కూడా వీళ్ళకి మద్ధతుగా సమ్మె చేస్తారంట. మనుష్యుల ప్రాణాలతో ఆడుకోవడానికా వీళ్ళు లక్షలు ఖర్చుపెట్టి వైద్యవృత్తి చదివింది.అసలు ఈ డాక్టర్లందరిని ఉద్యోగాలనుండి తీసేసి చదువుకుని నిస్వార్ధ సేవ చేయాలని ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారిని నియమించాలి ప్రభుత్వమైనా. కాని దానికి తెగులు పట్టింది ...ఖర్మ? ఏదో ఉద్ధరిస్తారని వాళ్ళను ఎన్నుకున్న మనం నేరస్తులం.

Monday 3 December 2007

యద్భావం తద్భవతి !!!!

ప్రపంచంలో జరిగే అన్యాయాలన్నింటిపై దృష్టి సారిస్తున్నావంటే ఖచ్చితంగా నువ్వు
అసంతృప్తివాదిగానే మిగిలిపోతావు. ఇది అక్షరసత్యం! మనసు నిండా ప్రశాంతత
ఉంటే ఎంత బాగుంటుందో ఊహించుకోండి. కానీ మనస్సు నిశ్చలంగా ఉన్నా ఏ
మూల నుండో భయం దోబూచులాడుతూనే ఉంటుంది. నడిరోడ్డులో జంట హత్య,
ప్రియురాలిని నరికి చంపిన మరో మనోహర్ అంటూ ప్రాసలు కట్టి మరీ పత్రికలూ,
మనసు పొరల్లో బలంగా ముద్రించుకుపోయేలా క్లోజప్‍లో రక్తపు ప్రవాహాన్ని
చిత్రీకరించే టెలివిజన్ చానెళ్ళు ఉన్నంతవరకూ మన మస్తిష్కాలు ప్రశాంతంగా
ఉండలేవు. హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, కుంభకోణాలు, రాజకీయాలు,
కుటుంబ తగాదాలు, అభిప్రాయబేధాలు…. ఇవేగా నేటి ప్రసార మాధ్యమాలకు
ముడి సరుకు! ఇలా పత్రికలు, టెలివిజన్ చానెళ్ళు తమ పేజీలను నింఫుకోవడానికి,
టైమ్ స్లాట్లని ఎలాగోలా నెట్టుకురావడానికి ఎక్కడ లేని చెత్తనంతా మన బుర్రల్లో
నింఫుతుంటే.. ప్రతీ దానికీ అదేదో మన సమస్యగా ఆవేశం తెచ్చుకునే వాళ్ళమే
మనమంతా ! తెల్లగా ప్రకాశించే మనసు పొరలపై ఎరుపు, నలుపు రంగులను
ఒలికిపోసి ప్రశాంతతను చిన్నాభిన్నం చేసుకోవడం మన స్వయంకృతం కాదా? ఈ
రోజు ఎవరిని కదిలించినా .. "చూడండి సార్! వాడికి సిగ్గు ఉందా, ఆ పని
చేశాడు, ఏమ్ రాజకీయాలండి పనికిమాలిన రాజకీయాలు, మా ప్రక్కింటి వాడు
ఉన్నాడు చూశారూ … వాడు ప్రపంచంలో పెద్ద వేస్ట్" అంటూ నిరంతర అసంతృప్తి
మొహాల్లో దోబూచులాడుతూనే ఉంటుంది. మనకు ఎక్కడా, ఎవరితోనూ సఖ్యత
ఉండదు. ఎందుకంటే మనం ప్రతీ దాన్ని అసంతృప్తి నుండి చూస్తున్నాం. మన
మనసుల్లో నెగెటివ్ భావాలు బలీయంగా స్థిరనివాసం ఏర్పరుచుకున్నాయి.
’తాను’ సరిచేయడానికి వీలుపడని సమస్యల్లో మనం తలదూర్చినప్పుడు మనస్సు
చంచలమౌతుంది. కారణం, సమస్యని పరిష్కరించాలని మనసు ఆరాటపడుతుంది.
కానీ సమస్య మాత్రం తన ఆధీనంలొ ఉండదు, దానితో ఏమీ పాలుపోక అస్థిమితంగా,
అసంతృప్తితో మనసు ఊగిసలాట సాగిస్తుంది. మన పరిధిలో లేని, మనవి కాని,
మనం స్వయంగా పరిష్కరించలేని అనేక సమస్యలనిమనసుల్లో మోస్తున్నాం. సమస్య
పరిష్కరించబడితేనే మనస్సు ఊరత చెందుతుంది. కానీ మనం నెత్తికెత్తుకునే ఏ
సమస్యా మనది కాదే… మన ఒక్కరితోనే పరిష్కారం లభించదే! మరి మనస్సు
ఎప్పటికి ఊరట చెందాలి. మనమెప్పుడు ప్రశాంతంగా ఉండాలి? నీ పనేదో నువ్వు
ఆనందంగా చేసుకుపోతూ ప్రక్క దిక్కులకు చూడకుండా మనసుకు కళ్ళెం వేయగలిగితేనే
ఎలాంటి తలనొప్పులు మనసులో పేరుకుపోవు. మనసు ఎల్లప్పుడూ నిశ్చలంగా ఉంటుంది.

మీ నల్లమోతు శ్రీధర్

Sunday 2 December 2007

పొద్దుకు మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు





గత సంవత్సరం పొద్దు పొడిచిన "పొద్దు"పత్రికకు మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు

Saturday 1 December 2007

ఆటాడుకుందాం రండి..

కోతి - ఫుట్‍బాల్


Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008