Wednesday 13 May 2009

అద్భుత స్వర సునామీ ...


శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానం రసం ఫణిః

గానానికి పులకరించని, పరవశించని ప్రాణి కలదే ఈ జగాన. గానం అనగానే ఎంతో విజ్ఞానం, స్వర మాధుర్యం, ప్రత్యేకమైన ప్రతిభ, పూర్వజన్మ సుకృతం ఉండాలి అనుకునేవారు ఎందరో . సంగీతాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాలంటే సంగీతం నేర్చుకుని ఉండాల్సిన పనిలేదు. ఏ భాష ఐనా సరే, స్వర మాధుర్యం, సంగీతం మనకు వీనుల విందు చేసి పరవశుల్ని చేస్తుంది. మధురమైన సంగీతానికి, లేదా పాటలకు మన మనస్సును ఆధీనంలోకి తీసుకుని బాధలను మరపింపచేసి ఓదార్చే గుణముంది. అది సినిమా సంగీతమైనా, వాద్య సంగీతమైనా, శాస్త్రీయ సంగీతమైనా సరే .. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన సంగీతం నచ్చుతుంది. కాని అందరికి నచ్చేది అన్నమయ్య పదాలు లేదా పాటలు. అదేంటి కీర్తనలను పాటలు అంటున్నా అనుకుంటున్నారా.. కాదండి. కీర్తనలు అంటే శాస్త్రీయ సంగీతం తెలిసినవాళ్లే అర్ధం చేసుకోగలరు, పాడగలరు. కాని పాటలు భాష తెలిసిన ప్రతి ఒక్కరు పాడుకోగలిగే, అర్ధం చేసుకోగలిగే సులభమైన , అందమైన పదాలతో కూడి ఉంటాయి. కాదంటారా.. అలాటి అన్నమయ్య కీర్తనలను ఒకేచోత లక్ష గళాలలో ప్రతిద్వనించాలని సంకల్పం జరిగింది. దీనికి ముఖ్య సూత్రధారులు సిలికానాంధ్ర, టిటిడి, సాంకేతిక శాఖ. సంకల్పానికి తోడు ప్రతిస్పందన ఉందాలి. అది అద్భుతమైన, అద్వితీయమైన రీతిలో లభించింది.


ఇది ఒక రాయకీయ నాయకుడి సభ కాదు, సినిమా ఫంక్షన్ కాదు, సన్మాన సభ కాదు. జనాలను సమీకరించలేదు. డబ్బులిచ్చి లారీలలో తోలుకురాలేదు. ప్రతి ఒక్కరు స్వచ్చందంగా వచ్చారు. లక్ష మంది వస్తారో రారో అన్న సంశయం అందరికీ ఉండింది. కాని అది లక్షన్నర దాటింది. ఇది ఎలా లెక్కించారంటే ఆ సభా ప్రాంగణంలో వేసింది లక్ష కుర్చీలు . కాని అవన్నీ నిండిపొయి , ఇంకా ఎక్కువమంది అభిమానులు వచ్చారు. వీళ్లందరు ఒక రికార్డు సృష్టిద్దామని మాత్రమే రాలేదు. అన్నమయ్య పదాలతో ఆ వేంకటేశ్వరుని కీర్తించి ధన్యులమవుదాము అన్న కోరిక మాత్రమే అక్కది జనాలలో కనిపించింది. ఎందుకంటే ఈ మహోన్నత కార్యక్రమంలో పాల్గొన్నవారు 3 ఏళ్ల నుండి 90 దాటినవారు కూడా ఉన్నారు. అందరూ గొంతు కలిపారు. ఇందులో సగం మంది కూడా శాస్త్రీయ పరిజ్ఞానం లేనివారే. సంగీతపరంగా సామాన్యులే అని అర్ధమైంది. వీరందిరికి స్వర సారధ్యం వహించింది శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు. నాయకుడు అన్నప్పుడు వేదికపైనే ఉండాలి. అతని ముందు మైకు పెట్టారు కాబట్టి టీవీలలో ఆ గొంతే వినిపించింది. కాని పాడినవారి స్వరప్రభంజనం ఒక సునామీలా వెల్లువెత్తింది అని ప్రత్యక్షంగా పాల్గొన్నావారికే అనుభవం .. ఎక్కడో కొందరు మాత్రం దిక్కులు చూస్తూ ఉండిపోయారు.


నేను ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఎంత ప్రయత్నించినా వీలుపడలేదు. బహుశా ఆ శ్రీనివాసుడి అనుమతి లేదేమో. కాని ఇంట్లో ఉండే ఆ మహాస్వర యాగంలో పరోక్షంగా పాల్గొన్నాను. అందరితో పాటు గొంతు కలిపాను.అది చాలు. నాకు పాడే అలవాటు లేదు. అన్నమయ్య కీర్తనలంటే చాలా ఇష్టం. అందుకే రాత్రి 7 నుండి 7.45 వరకు సాగిన ఈ లక్షగళ సంకీర్తనలో ఆ సప్త సంకీర్తనల భావ ప్రవాహంలో మునిగిపోయాను. నిజంగా ఆ సమయంలో ఒళ్లంతా విద్యుత్తు ప్రవహించినట్టుగా అనిపించింది. ఇంత అద్భుత గానం విని నా జన్మ ధన్యమైపోయింది. ఈ తృప్తి, ఆనందం తిరుపతిలో లో లక్షలు పెట్టి పూజలు, ఉత్సవాలు చేయించినా రాదు అని చెప్పగలను.


ఆరోజు ఆలాపించిన సప్త సంకీర్తనలు వరుసగా ఇదిగో...


భావములోనా బాహ్యమునందు




బ్రహ్మ కడిగిన పాదము




ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన




పొడగంటి మయ్యా




కొండలలో నెలకొన్న




నారాయణతే నమో నమో




ముద్దుగారే యశోద

8 వ్యాఖ్యలు:

గీతాచార్య

Cool. Very nice post.

గీతాచార్య

Very nice gesture. Nice videos.

సుజ్జి

i read about this event in news paper. its really amazing!

ప్రేమతో...మీ

ఇది తెలుగువారికి గర్వకారణం......మీకు మా ధన్యవాధాలు

teresa

Thanks for sharing.

పరిమళం

ఇతమంచి పోస్ట్ మాకు అందించినందుకు ధన్యవాదాలు జ్యోతిగారూ !

నేస్తం

:)
ధన్యవాదములు జ్యోతి గారు

మధురవాణి

అంత మంది ఒకేసారి ఆ శ్రీనివాసుని కీర్తనలను పాడటం నిజంగా అరుదైన విషయమే.. మీరు వర్ణించిన విధానం వాళ్ళ.. నేను కూడా దగ్గరుండి చూసిన అనుభూతి వచ్చింది.
ఓం నమో వెంకటేశాయ నమః

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008